Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరుణాకర్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేశారా... అందుకే నోటీసులా...?

కరుణాకర్‌రెడ్డి తుని ఘటనలో ఉన్నారన్న విషయం చర్చనీయాంశంగా మారింది. ఆ తరువాత సిఐడీ విచారణలో కరుణాకర్‌ రెడ్డే వెనుక నుండి స్కెచ్‌ వేశారని నిర్ణయానికి వచ్చారు. దీంతో తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం జరుగుతుండగా నోటీసులు అందించారు.

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2016 (18:40 IST)
కరుణాకర్‌రెడ్డి తుని ఘటనలో ఉన్నారన్న విషయం చర్చనీయాంశంగా మారింది. సిఐడీ విచారణలో కరుణాకర్‌ రెడ్డే వెనుక నుండి స్కెచ్‌ వేశారని నిర్ణయానికి వచ్చారు. దీంతో తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం జరుగుతుండగా నోటీసులు అందించారు. ఈ నెల 6వ తేదీ కోర్టుకు సిఐడీ కార్యాలయానికి హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. మూడురోజులుగా కరుణాకర్‌రెడ్డిని కలిసేందుకు సిఐడీ అధికారులు ప్రయత్నిస్తే చివరకు తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో దొరికారు కరుణాకర్‌రెడ్డి. 
 
కరుణాకర్‌ రెడ్డి పక్కా ప్లాన్‌ గీసి ముద్రగడ పద్మనాభంకు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. రైలును తగులబెట్టడం, విధ్వంసం చేసి ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం. ఇదంతా అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. అంతేకాదు ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియస్‌‌గా తీసుకుంది. హోంమంత్రి చినరాజప్ప దీని వెనుక ఎవరున్నా వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. అనుకున్న విధంగానే సిఐడీ అధికారులకు అప్పజెబితే ప్రస్తుతం చివరకు కరుణాకర్‌ రెడ్డి మెడకు వచ్చి చుట్టుకుంది. కరుణాకర్‌ రెడ్డితో పాటు మరో 20మంది ఇందులో విచారించేందుకు గుంటూరులోని సిఐడీ కార్యాలయానికి రావాలని నోటీసులు జారీ చేశారు.
 
కరుణాకర్‌ రెడ్డే ఈ ఘటనకు సూత్రధారి అని పక్కా ఆధారాలను కూడా సీఐడీ అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. కరుణాకర్‌రెడ్డి ఫోన్‌ను ట్యాప్‌ చేశారనీ, దానితోనే మరికొన్ని ఆధారాలు లభించినట్లు చెప్పుకుంటున్నారు. పక్కా ఆధారాలు ఉండడంతోనే మొదటగా కరుణాకర్‌రెడ్డినే సిఐడీ అధికారులు విచారించనున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments