టిటిడిని బిజెపి రాజకీయంగా వాడుకుంటుందా?

Webdunia
మంగళవారం, 26 మే 2020 (15:52 IST)
ఇప్పుడు ఎక్కడ చూసినా శ్రీవారి భూముల విక్రయానికి సంబంధించిన వ్యవహారమే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. భూముల విక్రయం జరగకపోయినా టిటిడి పాలకమండలి రెజల్యూషన్ ఇప్పుడు పెద్ద చర్చకు కారణమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బిజెపితో పాటు హిందూ ధార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. 
 
దీంతో రాష్ట్రప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇదంతా బాగానే ఉంది. కానీ భారతీయ జనతాపార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం రాష్ట్రవ్యాప్తంగా ఉపవాస దీక్షలు చేయడమే ఇప్పుడు అసలు చర్చ. ఇందులో కొత్త ట్విస్ట్. గతంలో టిటిడి పాలకమండలి సభ్యుడిగా ఉన్న భానుప్రకాష్ రెడ్డి బిజెపి నేత. 
 
గతంలో పాలకమండలి సభ్యుడుగా ఉన్నప్పుడు శ్రీవారి భూముల విక్రయానికి సంబంధించి తీర్మానంలో ఆయన సంతకం కూడా చేశారు. ఇది కాస్త పెద్ద చర్చకు దారితీస్తోంది. అప్పుడు పాలకమండలి సభ్యుడిగా ఆమోదించి ఇప్పుడు వ్యతిరేకించడం ఏమిటని వైసిపి నేతలు ప్రశ్నిస్తున్నారు.
 
రాజకీయంగా ఎదగడానికి టిటిడిని అడ్డుపెట్టుకుంటున్నారని.. బిజెపికి ఇది అలవాటుగా మారిపోయిందని ఆరోపిస్తున్నారు. గతంలో టిటిడి విషయంలోను బిజెపి అతిగా స్పందించిందన్న ప్రచారం లేకపోలేదు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వైసిపి నేతలు బిజెపిపై ప్రచారం చేసే పనిలో నిమగ్నమయ్యారు. మరి చూడాలి ఎపిలో రెండు పార్టీల మధ్య ఈ వ్యవహారం ఏ స్థాయికి తీసుకెళుతుందో. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూమ్ కాల్‌లో బోరున విలపించిన యాంకర్ అనసూయ

బాక్సాఫీస్ వద్ద 'మన శంకరవరప్రసాద్ గారు' దూకుడు

ఒక వర్గానికి చెందిన అభిమానులు పరాశక్తిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : దర్శకురాలు సుధా కొంగరా

Anasuya: పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. 42 మందిపై ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

మన శంకర వర ప్రసాద్ గారులో రాసిన ప్రతి సీన్‌కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సరే, మీరు పిల్లల్ని పంపడంలేదుగా, మే జారుతాం: జర్రున జారుతున్న కోతులు (video)

అద్భుతమైన కళాత్మక వస్త్రశ్రేణితో ఈ సంక్రాంతి సంబరాలను జరుపుకోండి

దక్షిణ భారతదేశంలో విస్తరిస్తున్న గో కలర్స్, హైదరాబాద్‌ ఏఎస్ రావు నగర్‌లో కొత్త స్టోర్ ప్రారంభం

ఏ ఆహారం తింటే ఎముకలు పటిష్టంగా మారుతాయి?

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తమ కార్యకలాపాలను ప్రారంభించిన వీక్యురా రీస్కల్ప్ట్

తర్వాతి కథనం
Show comments