Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో తితిదే విజిలెన్స్ విభాగ అధికారి మృతి.. ముందు కరోనా ఆపై నెగెటివ్....

Webdunia
మంగళవారం, 18 ఆగస్టు 2020 (22:37 IST)
చెన్నైలో నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో తితిదే అధికారి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. నిజానికి ఈయన కరోనా వైరస్ బారినపడి ఆ తర్వాత కోలుకున్నారు. ఇంతలోనే ఆయన చనిపోవడం వైద్యులను కూడా ఆశ్చర్యానికి లోను చేసింది. 
 
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో అసిస్టెంట్ విజిలెన్స్-సెక్యూరిటీ అధికారిగా వి.మహేశ్వరరావు పని చేస్తున్నారు. ఈయనకు కరోనా వైరస్ లక్షణాలతో గత జూలై నెల 28వ తేదీన చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. అంతకుముందు నుంచి ఈయన కొంత అనారోగ్యంతో బాధపడుతూ వచ్చారు. 
 
ఈ క్రమంలో రెండ్రోజుల కిందట నిర్వహించిన వైద్య పరీక్షలో కరోనా నెగెటివ్ అని రావడంతో, ఆయన త్వరలోనే డిశ్చార్జి అయి, విధుల్లో చేరతారని టీటీడీ వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి. కానీ ఆలయ వర్గాల్లో విషాదం నింపుతూ ఆ అధికారి మృతి చెందారు. మహేశ్వరరావు మృతిపై టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, చీఫ్ విజిలెన్స్-సెక్యూరిటీ ఆఫీసర్ జెట్టి గోపీనాథ్, ఇతర అధికారులు సంతాపం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments