జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు : తితిదే వెల్లడి

ఠాగూర్
మంగళవారం, 25 నవంబరు 2025 (21:07 IST)
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ నెల 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వెల్లడించింది. అయితే, తొలి మూడు రోజుల పాటు ఎలక్ట్రానికి డిప్, ఆ తర్వాతి రోజులకు వైకుంఠ క్యూ కాంప్లెక్స్-2 ద్వారా సర్వదర్శనాలు ఉంటాయని తితిదే అధికారులు వెల్లడించారు. 
 
ఈ క్రమంలో తొలి మూడు రోజులు ఎస్‌ఈడీ, శ్రీవాణి దర్శనాలు రద్దు చేయనున్నట్లు తెలిపింది. ప్రోటోకాల్‌ ప్రముఖులు మినహా వీఐపీ దర్శనాలు, ఇతర ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వైకుంఠ ద్వార దర్శన రోజులైన డిసెంబరు 30 నుంచి జనవరి 8 వరకు తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు తెలిపింది.
 
తొలి మూడు రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు నవంబరు 27వ తేదీ ఉదయం 10 గంటల నుంచి డిసెంబరు ఒకటో తేదీ సాయంత్రం 5 గంటల వరకు తితిదే వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in/, తితిదే యాప్‌, వాట్సాప్‌లో ఏపీ గవర్నమెంట్ బాట్‌లో తితిదే ఆలయాల విభాగంలో ఎల‌క్ట్రానిక్‌ డిప్‌కు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబరు 2వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ఎల‌క్ట్రానిక్‌ డిప్ వివరాలు వెల్లడిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments