Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిటిడి సంచలన నిర్ణయం, విజయసాయిరెడ్డి, రమణదీక్షితులపై పిటీషన్

Webdunia
సోమవారం, 16 నవంబరు 2020 (16:45 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. టిటిడి ప్రతిష్టను, గౌరవాన్ని దిగజార్చే విధంగా మాట్లాడిన వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి, రమణదీక్షితులపై పరువు నష్టం దావా కొనసాగించాలని టిటిడి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తిరుపతిలో ఒక పిటిషన్‌ను టిటిడి తరపున న్యాయవాది దాఖలు కూడా చేశారు. 
 
2008 సంవత్సరంలో టిటిడి ప్రతిష్ట దిగజార్చే విధంగా విజయసాయిరెడ్డితో పాటు రమణదీక్షితులు వ్యాఖ్యలు చేశారు. దీంతో అప్పట్లో దీనిపై ఇద్దరి మీద 200 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు. ఆ కేసు కాస్త నడుస్తూనే ఉంది. అయితే వైపిపి అధికారంలోకి రావడం.. సరిగ్గా నెల క్రితం వీరిపై ఉన్న పరువు నష్ట దావాను ఎత్తివేయడానికి మరో పిటిషన్‌ను నెల క్రితం తిరుపతిలోని కోర్టులో దాఖలు చేశారు.
 
అసలు ఈ మొత్తం కేసుకు సంబంధించి 2 కోట్ల రూపాయలను టిటిడి కోర్టుకు కూడా చెల్లించింది. కానీ ఇప్పుడు ఆ పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో బిజెపితో పాటు ప్రతిపక్షాలు మండిపడ్డాయి. దీంతో మళ్ళీ టిటిడి వెనక్కి తగ్గింది.
 
ఈరోజు మధ్యాహ్నం తిరుపతిలోని కోర్టు సముదాయాల్లో ఒక పిటిషన్‌ను టిటిడి తరపు న్యాయవాది దాఖలు చేశారు. అందులో రమణదీక్షితులు, విజయసాయిరెడ్డిలపై పరువు నష్ట దావాను కొనసాగించాలని కోర్టును కోరుతూ ఆ పిటిషన్ ఉంది. దీంతో ఈ కేసు ఆసక్తికరంగా మారబోతోంది. వారి నుంచి 200 కోట్ల రూపాయలను టిటిడి పరువు నష్టం కింద వసూలు చేస్తుందా.. లేకుంటే కేసుకు సంబంధించి న్యాయమూర్తి ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారనది ఆసక్తికరంగా మారుతోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments