తిరుమల శ్రీవారి దర్శన టిక్కెట్లను విడుదల చేసిన తితిదే

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2020 (21:38 IST)
తిరుమల: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తితిదే విడుదల చేసింది. జనవరి నెలకు సంబంధించిన కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. రోజుకు 20 వేల టికెట్ల చొప్పున జనవరి 4 నుంచి 31వ తేదీ వరకు రూ.300 టికెట్లను తితిదే వెబ్‌సైట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
 
ఒక యూజర్‌ ఐడీ నుంచి ఆరు టిక్కెట్ల వరకూ బుక్‌ చేసుకునే సదుపాయం కల్పించారు. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులకు దర్శనం కల్పిస్తున్న తితిదే నెలకొకసారి టిక్కెట్లను ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేస్తోంది. 
 
వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని తితిదే ఈ నెల 25 నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తోంది. ఈ కార్యక్రమం జనవరి 4వ తేదీ వరకూ జరగనుంది. కరోనా దృష్ట్యా తొలుత స్థానికులకే వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామని ప్రకటించిన తితిదే అనంతరం క్యూలైన్లలో నిల్చున్న వారికి సైతం టోకెన్లను జారీ చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments