Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి తొక్కిసలాట- గాయపడిన వారికి శ్రీవారి వైకుంఠద్వార దర్శనం (video)

సెల్వి
శుక్రవారం, 10 జనవరి 2025 (13:10 IST)
Tirumala
తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులకు టీటీడీ తిరుమల శ్రీవారి వైకుంఠద్వార దర్శనం చేయించింది. తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారికి మంచి వైద్యం అందించి, వైకుంఠద్వార దర్శనం కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీకి భక్తలు ధన్యవాదాలు తెలిపారు. 
 
సీఎం, టీటీడీ చైర్మన్ అదేశాల ప్రకారం మొత్తం 52 మందికి అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. గురువారం సాయంత్రం సీఎం చంద్రబాబు క్షతగాత్రులకు మెరుగైన వైద్యంతో పాటు శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తామని ప్రకటన చేశారు. ప్రకటన చేసినట్లుగానే టీటీడీ ఛైర్మన్, అధికారులతో మాట్లాడారు.. ఈ మేరకు ఇవాళ వారందరికి దర్శనం కల్పించారు.
 
మరోవైపు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీవారి అభిషేక సేవ అనంతరం వేకువజామున 3.45 గంటల నుంచే టీటీడీ అధికారులు దర్శనాలకు అనుమతించారు. వేకువజామునే అనుకున్న సమయం కంటే ముందే టీటీడీ ప్రొటోకాల్‌ ప్రముఖులకు దర్శనం కల్పించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments