Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు వదిలిన విషపు బాణమే షర్మిల : భూమన కరుణాకర్ రెడ్డి

ఠాగూర్
సోమవారం, 28 అక్టోబరు 2024 (13:54 IST)
వైఎస్ షర్మిలను లక్ష్యంగా చేసుకుని వైకాపా నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. వైఎస్ కుటుంబ ఆస్తుల పంపకంలో వివాదాలు పొడచూపాయి. దీంతో జగన్‌ను లక్ష్యంగా చేసుకుని షర్మిల తీవ్ర విమర్శలు చేస్తున్నారు. షర్మిలను లక్ష్యంగా చేసుకుని వైకాపా నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. ఇలాంటిలో వైకాపా నేత, తితిదే మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఒకరు. 
 
ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు వదిలిన విషపు బాణమే షర్మిల అని అన్నారు. ఆమెలాంటి చెల్లెలు జగన్‌కు ఉండడం బాధాకరమన్నారు. వైఎస్.రాజశేఖర్ రెడ్డిని ప్రజల గుండెల నుంచి తుడిచేయాలని చూసే తెలుగుదేశం పార్టీతో ఆమె కుమ్మక్కు కావడం దారుణమన్నారు. జగన్‌ను సర్వనాశనం చేయాలనే ఇలా చేస్తున్నారని ధ్వజమెత్తారు. 
 
రాజశేఖర్ రెడ్డి అనుచరులు ఏ ఒక్కరూ షర్మిల వెనుక నడవలేదనీ, అంతా జగన్ వెనుకే నడిచారన్నారు. ఇవన్నీ గ్రహించిన షర్మిల తెలంగాణకు వెళ్లారనీ, చివరకు కాంగ్రెస్‌ పార్టీలోనూ ఆమెకు మద్దతులేదని భూమన జోస్యం చెప్పారు. కాగా.. జగన్‌పై షర్మిల వ్యాఖ్యలు కూటమి కుట్రగానే కనిపిస్తోందని వైసీపీ ఎమ్మెల్సీ మధుసూదన్ తిరుమలలో అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments