Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tirumala Laddu : తిరుమల లడ్డూ ప్రసాదం తింటుంటే నాలుకకు గాయమైందట!

సెల్వి
శనివారం, 14 జూన్ 2025 (08:48 IST)
తిరుమల లడ్డూ ప్రసాదం తింటున్న సమయంలో తన నాలుకకు గాయమైందని తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన నవీన్ కుమార్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలపై టీటీడీ సీరియస్ అయ్యింది. ఈ విషయం సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు రంగంలోకి దిగారు. సంబంధిత వ్యక్తికి వైద్య సహాయం అందిస్తూ తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించింది. 
 
అనంతరం మరింత స్పష్టత కోసం స్విమ్స్ ఆసుపత్రిలో కూడా వైద్య పరీక్షలు చేయించారు. లడ్డూ ప్రసాదంలో ఎటువంటి ఇతర పదార్థాలు లేవని, నవీన్ ఆరోపించిన గాయం తన నాలుకను తానే గట్టిగా కొరుక్కోవడం వల్ల సంభవించిందని వైద్యులు తేల్చారు. 
 
ఇది ప్రమాదవశాత్తు ఆ వ్యక్తి నాలుకను కొరుక్కోవడం వల్లే జరిగిందని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలతో భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయలేరని టీటీడీ పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments