Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో ఆ మూడు దర్శనాలు రద్దు... మరి వారి పరిస్థితి ఏంటి?

Webdunia
శనివారం, 13 జులై 2019 (22:04 IST)
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన దిశగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అడుగులు వేస్తున్నారు. తిరుమల శ్రీవారిని సామాన్య భక్తులకు మరింత చేరువ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పలు అంశాల్లో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన వైవీ దర్శనాల విషయంలో కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. 
 
శ్రీవారిని దర్శించుకునే విషయంలో భాగంగా L1, L2, L3, దర్శనాలను రద్దు చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల ఈ దర్శనాలను ఏర్పాటు చేసిందని అందువల్లే వాటిని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు వీఐపీ దర్శనాల్లో కూడా కోతలు విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 
 
ఏడాదికి ఒకసారే శ్రీవారి దర్శనానికి వీఐపీలు రావాలని కోరుతున్నామని తెలిపారు. సామాన్య భక్తులకు దర్శనానికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. 
 
మరోవైపు 10, 15 రోజుల్లో పూర్తిస్థాయిలో టీటీడీ బోర్డ్ నియామకం ఉంటుందని తెలిపారు. టీటీడీ బోర్డ్ ఆస్పత్రిని పరిశీలించారు వైవీ సుబ్బారెడ్డి. ఆస్పత్రిలో 40 గదుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆపరేషన్స్ త్వరితగతిన జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. 8 ఆపరేషన్ థియేటర్లలో పరికరాలకు నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments