Webdunia - Bharat's app for daily news and videos

Install App

సామాన్య భక్తుడిలా నేలపై పడుకున్న టీడీడీ బోర్డు సభ్యుడు... (Video)

ఠాగూర్
సోమవారం, 18 నవంబరు 2024 (09:41 IST)
తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యుడుగా భారతీయ జనతా పార్టీకి చెందిన తిరుపతి వాసి భానుప్రకాష్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన తితిదే బోర్డు సభ్యుడుగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆయన క్షేత్రస్థాయిలో తన విధుల్లో నిమగ్నమయ్యారు. ఇందులోభాగంగా, ఆయన భక్తుల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. 
 
ఈ క్రమంలో ఆదివారం రాత్రి సామాన్య భక్తుడిగా నేలపై పడుకున్నారు. తిరుపతిలోని యాత్రి సదన్‌లో ఆయన ఇతర శ్రీవారి భక్తులతో కలిసి నిద్రించారు. ఈ సందర్భంగా ఆయన భక్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సర్వ దర్శనం టోకెన్స్ పెంచాలని, రూ.300 టికెట్లు నేరుగా ఇవ్వాలని భక్తులు చెప్పారు. అలాగే, భక్తులకు వసతి సౌకర్యాలను పెంచాలన్నని కోరారు. భక్తులు వెల్లడించిన అన్ని సమస్యలను తితిదే పాలక మండలి దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Simbu: నాపై రెడ్ కార్డ్ వేశారు, ఏడ్చాను - థగ్ లైఫ్ చేయనని చెప్పేశాను : శింబు

Rashmika: ట్రాన్స్ ఆఫ్ కుబేర టీజర్ రిలీజ్ - రష్మిక హైలైట్, మరి నాగార్జునకు కలిసివస్తుందా ?

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments