Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీటీడీ సహాయాన్ని కొనసాగించాలి: సీపీఐ

Webdunia
శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (16:17 IST)
గతంలో ప్రకటించినట్లుగా టీటీడీ సహాయాలు కొనసాగించాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు టీటీడీ బోర్డు చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శుక్రవారం లేఖ రాశారు.

లేఖలోని వివరాలు.. ''కరోనా విపత్తు నేపథ్యంలో రాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకు ప్రతీ జిల్లాకు రూ.ఒక కోటి చొప్పున ఇస్తామని, పలు ప్రాంతాల్లో ఆహార సదుపాయాలను కల్పిస్తామని ఇటీవల టిటిడి ప్రకటించింది.

(నిన్న) గురువారం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలిసింది. కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా కడుపునిండా తిండి లేక, నిలువ నీడ లేక పేదలు, వలస కూలీలు, సామాన్య ప్రజలు అల్లాడుతున్నారు.

ఏ మతానికి చెందిన దేవుడైన ప్రజాహితం కోరిన వారే. తక్షణం గతంలో ప్రకటించిన విధంగా 13 జిల్లాలకు జిల్లాకు రూ.ఒక కోటి చొప్పున నిధులు విడుదల చేయగలరు.

పలుచోట్ల టిటిడి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆహార పంపిణీ కార్యక్రమాన్ని కూడా కొనసాగించగలరు '' అని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments