మునుగోడులో హోరెత్తుతున్న ప్రచారం - గరిటపట్టిన తెరాస ఎమ్మెల్యే

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2022 (09:19 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ స్థానానికి వచ్చే నెల 3వ తేదీన ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్ని రాజకీయ పార్టీలు తీసుకున్నాయి. దీంతో ప్రచారం హోరెత్తిపోతోంది. 
 
ఈ క్రమంలో జిల్లాలోని చౌటుప్పల్ మండలం ఎల్లంబావి వద్ద తెరాస భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ సభ ఏర్పాట్లను తెరాస ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇందులోభాగంగా ఆయన వంటశాలను సందర్శించి, స్వయంగా గరిటపట్టారు. 
 
అధికార తెరాసకు చెందిన మల్కాజిగిరి ఎమ్మెల్యేగా మైనంపల్లి హన్మంతరావు కొనసాగుతున్న విషయం తెల్సిందే. వంట మనిషిగా మారిపోయారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్ మండలం ఎల్లంబావిలో ఈ సభ నిర్వహణ కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
ఈ సభకు హాజరయ్యే వారికి భోజనం ఏర్పాట్ల కోసం అనేక మంది వంట మనుషులతో ప్రత్యేకంగా భోజనం తయారు చేస్తున్నారు. ఈ భోజనం తయారీలో స్వయంగా పాలుపంచుకున్న హన్మంతరావు గరిట పట్టి వంట పనుల్లో నిమగ్నమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Renu Desai: రేబిస్‌ టీకా వేయించుకున్న రేణు దేశాయ్.. వీడియో వైరల్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments