కాక పుట్టిస్తున్న ట్రిపుల్ ఆర్.ఆర్.ఆర్ వ్యాఖ్యలు

Webdunia
సోమవారం, 17 ఆగస్టు 2020 (21:31 IST)
తెలుగురాష్ట్రాలో రాజమౌళి నిర్మించే ట్రిపుల్ ఆర్.ఆర్.ఆర్ సినిమా విశేషాలు కన్నా నరసాపురం ఎంపీ ట్రిపుల్ ఆర్.ఆర్.ఆర్ (రఘురామకృష్ణమరాజు) మాటల తూటాలు నేడు కాక పుట్టిస్తున్నాయి. ప్రతిరోజూ రచ్చబండ పేరుతో మీడియా ముందుకు వస్తున్న ఈయన తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా సోమవారం మరోమారు మీడియా ముందుకొచ్చారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సి.ఆర్డీఏలో ఆర్ 5 జోన్ పైన హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడం ఆహ్వానించదగిన పరిణామం అన్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ చీటికీమాటికీ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేయడం ద్వారా ప్రయోజనం ఉండదు అని, పెద్దపెద్ద లాయర్లకు కోట్ల రూపాయలను వెచ్చిస్తూ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు అని విమర్శించారు.
 
రాజధాని తరలింపు, సి.ఆర్.డి.ఏ చట్టం మార్పు అంశంపై సుప్రీంకోర్టులో బుధవారం జరిగే విచారణ కూడా రైతులకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాను అన్నారు. పార్టీకి చెడ్డపేరు రావద్దని నేను ఇచ్చే సలహాలు నచ్చని వారు ఇప్పటికీ నాపై బెదిరింపులకు పాల్పడుతునే ఉన్నారు.
 
తాను ఫిర్యాదు చేసినప్పటికీ గుర్రంపాటి దేవేందర్ రెడ్డిపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోలేదు అని, దేవేందర్ రెడ్డి ఇంకా నన్ను విమర్శిస్తూ ట్వీట్స్ చేస్తూనే ఉన్నాడు అని అతనిపై చర్యలు తీసుకోకపోతే ఇదే విషయాన్ని తను పార్లమెంటులో ప్రస్తావిస్తానన్నారు ట్రిపుల్ ఆర్.ఆర్.ఆర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2016లో విడాకులు తీసుకున్నారు... 2026లో మళ్లీ ఒక్కటైన సినీ సెలెబ్రిటీలు

కొత్త చిత్రాలకు కమిట్ కాలేదు.. 'ఓజీ-2'పై త్వరలో అప్‌డేట్

ప్రధాని మోడీ వల్లే దేశ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు : రేణు దేశాయ్

Prabhas: శర్వా.. బైకర్ ట్రైలర్‌ పై ప్రశంసలు కురిపించిన ప్రభాస్

Dil Raju: గాయపడ్డ సింహం విడుదల చేస్తాం, కానీ కండిషన్స్ అప్లై : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆనందం, ఆదరణ, నివారణ సంరక్షణతో వృద్ధాప్యాన్ని పునర్నిర్వచించాలని జాతీయ పిలుపు

మార్కెట్లోకి నకిలీ కోడిగుడ్లు, గుర్తించడం ఎలా?

డానోన్ ఇండియా రక్తహీనతపై పోరాటానికి సహాయం చేస్తామని ప్రతిజ్ఞ

టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల

తర్వాతి కథనం
Show comments