కాక పుట్టిస్తున్న ట్రిపుల్ ఆర్.ఆర్.ఆర్ వ్యాఖ్యలు

Webdunia
సోమవారం, 17 ఆగస్టు 2020 (21:31 IST)
తెలుగురాష్ట్రాలో రాజమౌళి నిర్మించే ట్రిపుల్ ఆర్.ఆర్.ఆర్ సినిమా విశేషాలు కన్నా నరసాపురం ఎంపీ ట్రిపుల్ ఆర్.ఆర్.ఆర్ (రఘురామకృష్ణమరాజు) మాటల తూటాలు నేడు కాక పుట్టిస్తున్నాయి. ప్రతిరోజూ రచ్చబండ పేరుతో మీడియా ముందుకు వస్తున్న ఈయన తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా సోమవారం మరోమారు మీడియా ముందుకొచ్చారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సి.ఆర్డీఏలో ఆర్ 5 జోన్ పైన హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడం ఆహ్వానించదగిన పరిణామం అన్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ చీటికీమాటికీ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేయడం ద్వారా ప్రయోజనం ఉండదు అని, పెద్దపెద్ద లాయర్లకు కోట్ల రూపాయలను వెచ్చిస్తూ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు అని విమర్శించారు.
 
రాజధాని తరలింపు, సి.ఆర్.డి.ఏ చట్టం మార్పు అంశంపై సుప్రీంకోర్టులో బుధవారం జరిగే విచారణ కూడా రైతులకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాను అన్నారు. పార్టీకి చెడ్డపేరు రావద్దని నేను ఇచ్చే సలహాలు నచ్చని వారు ఇప్పటికీ నాపై బెదిరింపులకు పాల్పడుతునే ఉన్నారు.
 
తాను ఫిర్యాదు చేసినప్పటికీ గుర్రంపాటి దేవేందర్ రెడ్డిపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోలేదు అని, దేవేందర్ రెడ్డి ఇంకా నన్ను విమర్శిస్తూ ట్వీట్స్ చేస్తూనే ఉన్నాడు అని అతనిపై చర్యలు తీసుకోకపోతే ఇదే విషయాన్ని తను పార్లమెంటులో ప్రస్తావిస్తానన్నారు ట్రిపుల్ ఆర్.ఆర్.ఆర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushmita Konidela : గోల్డ్ బాక్స్ తో నూతన చాప్టర్ బిగిన్స్ అంటున్న సుష్మిత కొణిదెల

ట్రోలింగ్ చేస్తే ఏంటి ప్రయోజనం.. నా వ్యాఖ్యలను వక్రీకరించారు.. రేణు దేశాయ్

Chiru: చిరంజీవి చిత్రం విశ్వంభర మళ్ళీ తెరముందుకు రాబోతుందా?

చాయ్ వాలా చిత్రం అందరికీ కనెక్ట్ కవుతుంది : సిటీ కమిషనర్ సజ్జనార్

మెచ్యూర్డ్‌ అండ్‌ ఇన్‌స్పిరేషన్‌ స్టోరీతో రాబోతున్న సినిమా శ్రీ చిదంబరం గారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments