Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజోలులో ఒకే కాన్పులు ముగ్గురు ఆడపిల్లలు.. మగబిడ్డ పుట్టివుంటే..?

Webdunia
ఆదివారం, 21 ఆగస్టు 2022 (09:32 IST)
కోనసీమ జిల్లా రాజోలులో ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. ఓ తల్లి నవమాసాలు ముగ్గురు బిడ్డలను మోసి వారికి జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం, ఊడిమూడి గ్రామానికి చెందిన నాగరాజు, భవాని భార్యాభర్తలు. వారి పెళ్లి జరిగి మూడేళ్ళు అయ్యింది. 
 
ఇక తాజాగా యిల్లింగి భవాని పురిటి నొప్పులతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరింది. ఇక ఆమె గర్భంలో ముగ్గురు కవల పిల్లలు ఉన్నారు అని గుర్తించిన ఆసుపత్రి వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించి ముగ్గురు కవల పిల్లలను డెలివరీ చేశారు. 
 
కానీ పుట్టిన ముగ్గురు ఆడపిల్లలు చాలా ఆరోగ్యంగా ఉన్నారని, తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ముగ్గురు పిల్లలు పుట్టటం ఆనందంగా ఉందని భవాని భర్త నాగరాజు వెల్లడించారు. 
 
అయితే రోజువారి కూలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమకు ఒకే కాన్పులో ముగ్గురు ఆడపిల్లలు పుట్టడం కాస్త భారమని తండ్రి నాగరాజు చెబుతున్నాడు. మగబిడ్డ ఒక్కడైనా పుట్టివుంటే బాగుండేదని చెప్తున్నాడు. అయినా దేవుడిచ్చిన బిడ్డల్ని బాగా పెంచుకుంటామని చెప్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments