Webdunia - Bharat's app for daily news and videos

Install App

11 ఏళ్ల గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం.. తండ్రి నిలదీస్తే?

Webdunia
శనివారం, 22 జులై 2023 (16:51 IST)
దేశంలో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా గుంటూరులో దారుణం జరిగింది. 11 ఏళ్ల గిరిజన బాలికపై ఇద్దరు దుండుగులు సామూహిక అత్యాచారం చేశారు. రెండు రోజుల తరువాత మళ్లీ బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. 
 
దీంతో తట్టుకోలేని ఆ తండ్రి ఏమైతే అది అవుతుందని వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నిలదీసిన తండ్రిని బెదిరింపులకు గురిచేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
 
వివరాల్లోకి వెళితే.. మంగళగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో 11 ఏళ్ల గిరిజన బాలిక ఒంటరిగా ఇంట్ోల వున్న సమయంలో 30 ఏళ్ల లక్ష్మయ్య, 25 ఏళ్ల నవీన్ బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తరువాత ఈ విషయాన్ని బాధితురాలు తన తండ్రికి తెలిపింది. దీంతో తండ్రి కోపంతో నిందితులను నిలదీశాడు. 
 
కానీ నిందితులే అతడిపై దాడి చేశారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని హెచ్చరించారు. దీంతో నిందితురాలి తండ్రి భయపడి బయటికి చెప్పలేదు. కానీ రెండు రోజుల తర్వాత కూడా తన కుమార్తెపై అత్యాచారం జరగడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments