Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎల్లమ్మకు పొట్టేలుకు బదులు మనిషిని బలిచ్చారు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (08:14 IST)
తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబంరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడకల్లో చిన్నాపెద్దా, ఊరువాడా అనే తేడా లేకుండా కలిసిపోయి పెద్ద పండుగను జరుపుకున్నాయి. అయితే, చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం వలసపల్లెలో ఓ విషాదం జరిగింది. స్థానిక ఎల్లమ్మ ఆలయం వద్ద జరిగిన వేడుకల్లో పొట్టేలుకు బదులుగా మనిషిని బలిచ్చారు. ఇది స్థానికంగా సంచలనమైంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, వలసపల్లె గ్రామంలో సంప్రదాయంగా వస్తున్న పశువుల పండుగను ఘనంగా నిర్వహించారు. ఆ తర్వాత ఎల్లమ్మ ఆలయం వద్ద పొట్టేలును బలి ఇచ్చేందుకు స్థానికులు సిద్ధమయ్యారు. పొట్టేలును అమ్మవారికి బలిచ్చేముందు అక్కడున్నవారంతా పీకల వరకు మద్యం సేవించారు. ఆ తర్వాత పొట్టేలు తల తెగనరికే క్రమంలో 35 యేళ్ల సురేష్ అనే వ్యక్తి పొట్టేలును గట్టిగా పట్టుకున్నాడు. 
 
మద్యంమత్తులో ఉన్న మరో వ్యక్తి పొట్టేలు తల నరకకుండా ప్రమాదవశాత్తు దానిని పట్టుకున్న సురేష్ అనే వ్యక్తి తల తెగనరికాడు. దీంతో సురేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో పశువుల పండుగలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ వేడుకల్లో పాల్గొన్నవారంతా భయంతో పరుగులు తీశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments