Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా లోకేష్, వంగ‌ల‌పూడి అనిత‌ల‌పై విజ‌య‌వాడ‌లో కేసులు న‌మోదు

Webdunia
శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (12:29 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితల‌పై విజయవాడలో కేసులు నమోదు అయ్యాయి. వారు ట్రాఫిక్‌ అంతరాయం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించారంటూ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 34, 186, 269 సెక్షన్ల కింద ఇద్దరిపై కేసు నమోదు అయింది.
 
గుంటూరు జిల్లా న‌ర‌స‌రావుపేట‌లో బాధితురాలి కుటుంబాన్ని ఓదార్చేందుకు టీడీపీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిన్న విశ్వ‌ప్ర‌య‌త్నం చేశారు. హైద‌రాబాదు నుంచి విజ‌యవాడ ఎయిర్ పోర్ట్ కి వ‌చ్చిన లోకేష్ ను అక్క‌డే పోలీసులు అడ్డుకున్నారు. న‌ర‌స‌రావుపేట‌కు వెళ్ళేందుకు అనుమ‌తి లేద‌ని ఆరెస్ట్ చేసి, తాడేప‌ల్లిలోని లోకేష్ నివాసానికి త‌ర‌లించారు. ఈ యాత్ర‌లో తాను పాల్గొనేందుకు నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించి, తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత కూడా ట్రాఫిక్ వ‌ల‌యాన్ని ఛేదించి, న‌ర‌స‌రావుపేట‌కు ప్ర‌యాణం అయినందుకు ఆమె పైనా కేసు పెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments