Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయంగా వేధించేందుకే ఈడీ కేసు : రేవంత్ రెడ్డి

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (15:40 IST)
తనను రాజకీయంగా వేధించేందుకు తనపై ఈడీ కేసును నమోదు చేశారని టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా 150 కోట్ల మేరకు నగదు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. 
 
తనపై గెలిచిన పట్నం నరేందర్ రెడ్డి వద్ద కూడా రూ.50 లక్షలు మేరకు స్వాధీనం చేసుకున్నారని, ఆయనపై ఈడీ ఎందుకు కేసు నమోదు చేయలేదని చెప్పారు. అలాగే, నగదు స్వాధీనం చేసుకున్న వారందరిపై కేసులు నమోదు చేశారా అని ఆయన ప్రశ్నించారు. 
 
సోమవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీలు ఏకమయ్యారని అందుకే తమపై ఈడీ కేసును నమోదు చేశారన్నారు. ముఖ్యంగా, డబ్బు పట్టుకున్న కేసులో చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత కేసును ఈడీకి బదిలీ చేయడం వెనుక ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. 
 
అదేసమయంలో తెరాసలో కేటీఆర్ కంటే హరీశ్ రావే అర్హుడన్నారు. మొదటి నుంచి ఉద్యమంలో ఉన్న నాయకుడిగా హరీశ్‌పై ప్రజల్లో సానుభూతి ఉందన్నారు. తోటపల్లి, గౌరారం రిజర్వాయర్లలో రూ.వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ స్కామ్‌లో హరీశ్ రావు రూ.600 కోట్ మేరకు వెనుకేసుకున్నారని ఆరోపించారు. ఆ డబ్బులను మొన్నటి ఎన్నికల్లో తెరాస అభ్యర్థులకు పంచారని విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments