Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయంగా వేధించేందుకే ఈడీ కేసు : రేవంత్ రెడ్డి

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (15:40 IST)
తనను రాజకీయంగా వేధించేందుకు తనపై ఈడీ కేసును నమోదు చేశారని టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా 150 కోట్ల మేరకు నగదు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. 
 
తనపై గెలిచిన పట్నం నరేందర్ రెడ్డి వద్ద కూడా రూ.50 లక్షలు మేరకు స్వాధీనం చేసుకున్నారని, ఆయనపై ఈడీ ఎందుకు కేసు నమోదు చేయలేదని చెప్పారు. అలాగే, నగదు స్వాధీనం చేసుకున్న వారందరిపై కేసులు నమోదు చేశారా అని ఆయన ప్రశ్నించారు. 
 
సోమవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీలు ఏకమయ్యారని అందుకే తమపై ఈడీ కేసును నమోదు చేశారన్నారు. ముఖ్యంగా, డబ్బు పట్టుకున్న కేసులో చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత కేసును ఈడీకి బదిలీ చేయడం వెనుక ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. 
 
అదేసమయంలో తెరాసలో కేటీఆర్ కంటే హరీశ్ రావే అర్హుడన్నారు. మొదటి నుంచి ఉద్యమంలో ఉన్న నాయకుడిగా హరీశ్‌పై ప్రజల్లో సానుభూతి ఉందన్నారు. తోటపల్లి, గౌరారం రిజర్వాయర్లలో రూ.వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ స్కామ్‌లో హరీశ్ రావు రూ.600 కోట్ మేరకు వెనుకేసుకున్నారని ఆరోపించారు. ఆ డబ్బులను మొన్నటి ఎన్నికల్లో తెరాస అభ్యర్థులకు పంచారని విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments