Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ఒంగోలుకు టీడీపీ అధినేత చంద్రబాబు - ఘన స్వాగతానికి ఏర్పాట్లు

Webdunia
గురువారం, 26 మే 2022 (09:19 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఒంగోలుకు చేరుకోనున్నారు. ఒంగోలు కేంద్రంగా తెలుగుదేశం పార్టీ మహానాడు జరుగనున్న విషయం తెల్సిందే. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు మహానాడు ప్రారంభమయ్యే శుక్రవారం ఒంగోలుకు వస్తారని అందరూ భావించారు. కానీ, ఆయన ఒక్క రోజు ముందుగానే ఒంగోలుకు చేరుకుంటున్నారు. 
 
ఇదిలావుంటే, మహానాడు జరిగే ప్రాంగణం అయిన మండవవారిపాలె పొలాల్లో వారం రోజులుగా ముమ్మంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. దాదాపు మహానాడు ఏర్పాట్లు ఓ కొలిక్కిరాగా ఒంగోలు నగరంలోని ప్రధాన కూడళ్ళు, రహదారులు, పాత బైపాస్ రోడ్డు ప్రాంతాలు టీడీపీ తోరణాలు, జెండాలు, నేతల ఫ్లెక్సీలు, హోర్డింగులతో నిండిపోయాయి. 
 
అలాగే, మహానాడు ప్రాంగణంలో ప్రతినిధుల సభ, బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తి కావస్తుండగా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బుధవారం సాయంత్రం ఒంగోలు చేరుకున్నారు. రాష్ట్ర, జిల్లా నేతలతో కలిసి మహానాడు ప్రాంగణాన్ని సందర్శించి, అక్కడ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

Dhanush: ధనుష్ మిస్టర్ కార్తీక్ రీ రిలీజ్ కు సిద్ధమైంది

రాజు గాని సవాల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాం : డింపుల్ హయతి, రాశీ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments