Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం చంద్రబాబు ఆదేశంతో తిరుపతిలో ఆ వంతెన పేరు మళ్ళీ మారింది...

ఠాగూర్
సోమవారం, 18 నవంబరు 2024 (15:40 IST)
తిరుపతిలో గత 2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలో వంతెన నిర్మించి దానికి గరుడ వారధి అనే పేరు పెట్టారు. అయితే, గత వైకాపా పాలకులు శ్రీనివాస సేతు వారధిగా పేరు మార్చారు. ఇపుడు ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఇపుడు మళ్లీ ఈ వంతెన పేరు మార్చారు. తిరిగి గురుడ వారధిగానే నామకరణం చేశారు. 
 
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలకు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్, జగనన్న పేరుతో పథకాల పేర్లు మార్పు చేశారు. దీంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా జగనన్న పేరుతో ఉన్న పథకాలన్నింటికీ పేర్లు మార్పు చేయడం జరిగింది.
 
తాజాగా మరో ప్రాజెక్టుకు జగన్ హయాంలో పెట్టిన పేరును ఈ సర్కార్ తొలగించింది. తిరుపతిలోని శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ పేరును ఆఫ్కాన్ సంస్థ మార్పు చేసింది. శ్రీనివాస సేతు స్థానంలో గరుడ వారధిగా పేరును అధికారులు మార్పు చేశారు. 2018లో గరుడ వారధి పేరుతోనే ప్రాజెక్టును అప్పటి సీఎం చంద్రబాబు ప్రారంభించారు.
 
అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం గరుడ వారధి స్థానంలో శ్రీనివాససేతుగా పేరును మార్చింది. తాజాగా సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు తిరిగి గడుడ వారధిగా పేరును మార్చేశారు. నగర ప్రజల నుండి పెద్ద ఎత్తున వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో పాత పేరును కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments