Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో చనిపోయిన అనాధ శవాలకు తిరుపతి ఎమ్మెల్యే అంతిమ సంస్కారం...

Webdunia
బుధవారం, 5 మే 2021 (16:48 IST)
కోవిడ్‌తో చనిపోయిన 21 మంది అనాధ శవాలకు దగ్గరుండి అంతిమ సంస్కారం చేశారు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. రుయాలోని మార్చురీ నుంచి స్వయంగా తన చేతులతో మృతదేహాలను మోసి ఆంబులెన్స్ లోకి ఎక్కించారు. ఆ తరువాత వాటిని మామండూరు ప్రాంతానికి తీసుకెళ్ళి ఖననం చేశారు. 
 
ఈ సంధర్భంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, నిన్నటి వరకు అంత్యంత ఆత్మీయులుగా మనతో, మన మధ్య తిరిగిన వారు కరోనా కారణంగా చనిపోతే మానవత్వం లేకుండా వదిలి వెళ్ళిపోయిన వారు, ఆర్థిక సమస్యలతో మృతదేహాలను వదిలి వెళ్ళిపోయిన వారికి సంబంధించి మొత్తం 21 మృతదేహాలను గుర్తించామన్నారు. అందుకే అలాంటి వారికి అన్నీ తానై అంతిమ సంస్కారం చేసినట్లు చెప్పారు. తనకు 60 సంవత్సరాల వయస్సు పైబడిందని.. ఇప్పటికే రెండుసార్లు కరోనా కూడా సోకిందని కరుణాకర్ రెడ్డి చెప్పారు.
 
అయినా సరే ఎలాంటి భయాందోళనకు తాను గురికావడం లేదని.. దగ్గరుండి దహనసంస్కారాలు పూర్తి చేసినట్లు తిరుపతి ఎమ్మెల్యే చెప్పారు. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని.. కోవిడ్ బారిన పడకుండా ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments