Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి లోక్‌సభ : వైకాపా అభ్యర్థి ఘన విజయం

Webdunia
ఆదివారం, 2 మే 2021 (17:23 IST)
ఏపీలోని తిరుపతి పార్లమెంటు స్థానానికి జరిగిన ఉపఎన్నికలో వైకాపా ఘనవిజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి గురుమూర్తి 2,65,988 ఓట్లతో తిరుగులేని మెజారిటీ సాధించారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి 6,11,1116 ఓట్లు పోలవగా, తెలుగుదేశం పార్టీకి 3,45,128 ఓట్లు వచ్చాయి. ఇక జనసేనతో కలిసి ఎన్నికల బరిలో దిగిన బీజేపీ డిపాజిట్‌ గల్లంతయ్యింది. ఆ పార్టీ 56,035 ఓట్లు మాత్రమే సాధించగలిగింది.
 
గత 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తిరుపతి నియోజకవర్గంలో వైసీపీ నుంచి బల్లి దుర్గాప్రసాద్‌ గెలుపొందారు. గతేడాది ఆయన కరోనాతో మరణించడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో తిరుపతి లోక్‌సభ స్థానానికి ఏప్రిల్‌ 17న ఉపఎన్నిక జరిగింది. ఇక్కడ టీడీపీ నుంచి మాజీ మంత్రి పనబాక లక్ష్మి పోటీచేశారు. 
 
ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి వైసీపీ ఆధిక్యం ప్రదర్శించి. ప్రతి రౌండ్‌లో మెజారిటీ పెంచుకుంటూ పోయింది. ఓట్ల లెక్కింపు సగం పూర్తయ్యేవరకు ఆ పార్టీ అభ్యర్థి గురుమూర్తి.. ప్రత్యర్థికి అందనంత మెజారిటీలో నిలిచి గెలపు ఖాయం చేసుకున్నారు. మొత్తంగా వైసీపీకి 57 శాతానికిపైగా ఓట్లు పోలయ్యాయి.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments