Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలగిరిలో ఆరేళ్ల బాలుడికి కరోనా..

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (11:25 IST)
తిరుమలగిరి పట్టణంలో కరోనా వైరస్ వ్యాపిస్తోంది. ఇప్పటికే ఇద్దరికి పాజిటివ్‌ రాగా, మరో వ్యక్తికి కూడా పాజిటివ్‌ తేలింది. జిల్లాలో నమోదైన తొలి పాజిటివ్‌ కేసు వ్యక్తి మర్కజ్‌కు వెళ్లి వస్తూ మార్గమధ్యలో తిరుమలగిరిలోని ఓ ప్రార్థన మందిరంలో బస చేశాడు. అతడినుంచి ఈ ప్రార్థన మందిరంలో పనిచేస్తున్న వ్యక్తికి కరోనా అంటుకుంది.

ఇతనినుంచి ఇంటి పక్కనే ఉన్న మరో వ్యక్తికి పాజిటివ్‌ వచ్చినట్లు ధ్రువీకరించారు. తాజాగా పట్టణంలో చికెన్‌షాప్‌లో పనిచేస్తున్న వ్యక్తికి వీరినుంచే వైరస్‌ అంటుకున్నట్లు తేలింది. అలాగే ఆత్మకూర్‌ మండలంలో ఏపూర్‌లో ఒక పాజిటివ్‌ కేసు నమోదైంది.
 
సూర్యాపేట పట్టణంలోని మార్కెట్‌ బజార్‌కు ఏపూర్‌కు చెందిన పాజిటివ్‌ వ్యక్తి తండ్రి ఇటీవల వెళ్లాడు. ఇతను మార్కెట్‌లో ఉంటున్న, ప్రస్తుతం పాజిటివ్‌ వచ్చిన ఓ వ్యాపారికి డబ్బులు ఇచ్చాడు. ఇతని కుటుంబాన్నంతా ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించి నమూనాలను పరీక్షల కోసం పంపారు. తండ్రి, కుటుంబ సభ్యులు మినహాయిస్తే కుమారుడికి పాజిటివ్‌ వచ్చినట్లు పరీక్షల్లో తేలింది. ఆ కుమారునికి ఆరేళ్లే. కుటుంబంలో అందరికి నెగెటివ్‌ వచ్చి ఈ బాలుడికి పాజిటివ్‌ రావడంతో కుటుంబ సభ్యులంతా ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments