Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల: ఆ ఘాట్ రోడ్డు ఎప్పుడు పూర్తవుతుంది గోవిందా?

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (22:04 IST)
భారీ వర్షాల కారణంగా తిరుపతి, తిరుమలలో భారీగా నష్టం జరిగింది. ఇప్పటికీ కొండచరియలు ఘాట్ రోడ్డులో విరిగిపడుతుండడం టిటిడి అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు భక్తులు భయబ్రాంతులు గురికావడానికి కారణమవుతోంది. గత నాలుగురోజులకు ముందు రెండవ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడి రోడ్డు మొత్తం తెగిపోయింది. రక్షణ వలయం మొత్తం కొట్టుకపోయింది. 

 
దీంతో మరమ్మత్తులను ప్రారంభించారు టిటిడి అధికారులు. ప్రస్తుతం మొదటి ఘాట్ రోడ్డులోనే వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. మొదటి ఘాట్ రోడ్డులో వాహన రాకపోకలు జరుగుతుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

 
కేవలం 40 నిమిషాల్లో తిరుమలకు వెళ్ళాల్సిన భక్తులు కాస్త 3 గంటలకుపైగా సమయం పడుతోంది. అందులోను ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో చెన్నైకు చెందిన ఐఐటి నిపుణులు, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి టిటిడి ఛైర్మన్ పరిశీలించారు.

 
ఈ నెలాఖరు లోగా ఘాట్ రోడ్డును పునఃప్రారంభిస్తామని చెప్పారు. ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తించిన కొండచరియలను కెమికల్ టెక్నాలజీని ఉపయోగించి ఇబ్బందులు లేని విధంగా తొలగించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఛైర్మన్ ఆదేశించారు.

 
అలాగే భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉపద్రవాలు తలెత్తకుండా శాశ్వత చర్యలపైన దృష్టి పెట్టాలన్నారు. డౌన్ ఘాట్ రోడ్డు నుంచే వాహనాల రాకపోకలు సాగుతున్నందు వల్ల అలిపిరి, లింక్ బస్టాండ్, తిరుమలలో భక్తులు గంటల కొద్దీ వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తోందని.. వీరి ఇబ్బందులు తొలగించడానికి లింక్ రోడ్డు మీదుగా తిరుమలకు వాహనాలు అనుమతించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర రిలీజ్ వాయిదాకు కారణం?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

86 ఏళ్ల వృద్ధుడిలో మింగే రుగ్మతను విజయవంతంగా పరిష్కరించిన విజయవాడ మణిపాల్ హాస్పిటల్

తర్వాతి కథనం
Show comments