Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో ఎక్కడైనా అన్నప్రసాదమే.. హోటల్స్ ఇక వుండవ్

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (10:37 IST)
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులందరికీ శ్రీవారి అన్న ప్రసాదం అందించేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొండపై ఉన్న ప్రైవేటు హోటల్స్‌లను తొలగిస్తామని, ఈ నెలాఖరులోగా తిరుమలలో సాధారణ పరిస్థితులు తెస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 
 
కొండపైన అన్ని చోట్లా అన్న ప్రసాదం అందించాలని, అన్న ప్రసాద భవనంలో ఆహారం తయారీకి సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. కరోనా కారణంగా రెండు సంవత్సరాల క్రితం నిలిపివేసిన ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభించాలని, ఆర్జిత సేవలకు భక్తుల అనుమతిపై రెండు రోజుల్లో ప్రకటన చేస్తామన్నారు. 
 
సిఫార్సు లేఖపై ఇచ్చే ఆర్జిత సేవా టికెట్ల ధరలు పెంచాలని పాలక మండలి నిర్ణయం తీసుకుంది. అయితే.. ధరలు ఏ మేరకు పెంచుతారు అన్నది టీటీడీ చైర్మన్ వెల్లడించలేదు.
 
* త్వరలోనే అన్నమయ్య మార్గం ఏర్పాటు.
* అటవీశాఖ అనుమతి వచ్చేలోగా తాత్కాలిక పనులు చేపట్టాలని నిర్ణయం.
* ప్రస్తుతం నడక దారిన వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు.
* తిరుపతిలో 50 ఎకరాల్లో ఆధ్యాత్మిక నగరం ఏర్పాటుకు నిర్ణయం
* మహాద్వారం, బంగారు వాకిలి, ఆనందనిలయానికి బంగారు తాపడం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments