Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల ఘాట్ రోడ్లపై దేవాంగ పిల్లులు!!

Webdunia
మంగళవారం, 26 మే 2020 (09:06 IST)
కరోనా వైరస్ ప్రజలకు హాని చేస్తే ప్రకృతితో పాటు.. వన్య ప్రాణులకు మాత్రం ఎంతో మేలు చేసిందని చెప్పొచ్చు. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు దేశం మొత్తం లాక్డౌన్‍లో ఉంది. దీంతో వాహనరాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. ఫలితంగా అడవుల్లో సంచరించే అనేక క్రూర మృగాలతో పాటు.. వన్యప్రాణులు సైతం స్వేచ్ఛగా రోడ్లపై విహరిస్తున్నాయి. 
 
ఇలాంటి దృశ్యాలను తిరుమల ఘాట్ రోడ్లపై చూశాం. ఇపుడు తాజాగా మరో అరుదైన దృశ్యం కనిపించింది. తిరుమల రెండో ఘాట్ రోడ్డు చివరి మలుపు సమీపంలో రెండు అరుదైన పిల్లలు కనిపించాయి. వీటిని దేవాంగ పిల్లులుగా అధికారులు గుర్తించారు. ఇవి కేవలం అటవీ ప్రాంతంలోనే కనిపిస్తుంటాయి. 
 
ఈ ఘాట్ రోడ్డులో నిర్మాణ పనులు చేస్తున్న రోడ్డు నిర్మాణ కార్మికులు ఈ పిల్లులను గుర్తించి, తితిదే అధికారులకు సమాచారం చేరవేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు వాటిని అక్కడే ఉంచారు. అరుదైన జాతికి చెందిన ఈ దేవాంగ పిల్లులు శేషాచలం అటవీప్రాంతంలో నివసిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments