Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల ఘాట్ రోడ్లపై దేవాంగ పిల్లులు!!

Webdunia
మంగళవారం, 26 మే 2020 (09:06 IST)
కరోనా వైరస్ ప్రజలకు హాని చేస్తే ప్రకృతితో పాటు.. వన్య ప్రాణులకు మాత్రం ఎంతో మేలు చేసిందని చెప్పొచ్చు. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు దేశం మొత్తం లాక్డౌన్‍లో ఉంది. దీంతో వాహనరాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. ఫలితంగా అడవుల్లో సంచరించే అనేక క్రూర మృగాలతో పాటు.. వన్యప్రాణులు సైతం స్వేచ్ఛగా రోడ్లపై విహరిస్తున్నాయి. 
 
ఇలాంటి దృశ్యాలను తిరుమల ఘాట్ రోడ్లపై చూశాం. ఇపుడు తాజాగా మరో అరుదైన దృశ్యం కనిపించింది. తిరుమల రెండో ఘాట్ రోడ్డు చివరి మలుపు సమీపంలో రెండు అరుదైన పిల్లలు కనిపించాయి. వీటిని దేవాంగ పిల్లులుగా అధికారులు గుర్తించారు. ఇవి కేవలం అటవీ ప్రాంతంలోనే కనిపిస్తుంటాయి. 
 
ఈ ఘాట్ రోడ్డులో నిర్మాణ పనులు చేస్తున్న రోడ్డు నిర్మాణ కార్మికులు ఈ పిల్లులను గుర్తించి, తితిదే అధికారులకు సమాచారం చేరవేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు వాటిని అక్కడే ఉంచారు. అరుదైన జాతికి చెందిన ఈ దేవాంగ పిల్లులు శేషాచలం అటవీప్రాంతంలో నివసిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments