Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల ఘాట్ రోడ్లపై దేవాంగ పిల్లులు!!

Webdunia
మంగళవారం, 26 మే 2020 (09:06 IST)
కరోనా వైరస్ ప్రజలకు హాని చేస్తే ప్రకృతితో పాటు.. వన్య ప్రాణులకు మాత్రం ఎంతో మేలు చేసిందని చెప్పొచ్చు. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు దేశం మొత్తం లాక్డౌన్‍లో ఉంది. దీంతో వాహనరాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. ఫలితంగా అడవుల్లో సంచరించే అనేక క్రూర మృగాలతో పాటు.. వన్యప్రాణులు సైతం స్వేచ్ఛగా రోడ్లపై విహరిస్తున్నాయి. 
 
ఇలాంటి దృశ్యాలను తిరుమల ఘాట్ రోడ్లపై చూశాం. ఇపుడు తాజాగా మరో అరుదైన దృశ్యం కనిపించింది. తిరుమల రెండో ఘాట్ రోడ్డు చివరి మలుపు సమీపంలో రెండు అరుదైన పిల్లలు కనిపించాయి. వీటిని దేవాంగ పిల్లులుగా అధికారులు గుర్తించారు. ఇవి కేవలం అటవీ ప్రాంతంలోనే కనిపిస్తుంటాయి. 
 
ఈ ఘాట్ రోడ్డులో నిర్మాణ పనులు చేస్తున్న రోడ్డు నిర్మాణ కార్మికులు ఈ పిల్లులను గుర్తించి, తితిదే అధికారులకు సమాచారం చేరవేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు వాటిని అక్కడే ఉంచారు. అరుదైన జాతికి చెందిన ఈ దేవాంగ పిల్లులు శేషాచలం అటవీప్రాంతంలో నివసిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments