Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశాన్ని కుదిపేస్తున్న తిరుమల లడ్డూ వివాదం.. సీఎంకు తితిదే ఈవో నివేదిక

ఠాగూర్
ఆదివారం, 22 సెప్టెంబరు 2024 (10:53 IST)
పవిత్ర తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం దేశాన్ని కుదిపేస్తుంది. శ్రీవారి లడ్డూను అపవిత్రం చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. జంతువుల కొవ్వు కలిపిన నెయ్యితో శ్రీవారి లడ్డూను తయారు చేసినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఈ లడ్డూ వివాదం దేశ వ్యాప్తంగా మహా విస్ఫోటనంలా తయారైంది. తిరుమలను అపవిత్రం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు దేశ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి.
 
 ఈ నేపథ్యంలో లడ్డూ అంశంపై తితిదే ఈవో శ్యామలరావు శనివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి ఓ నివేదిక సమర్పించారు. దీనిపై మరింత సమాచారాన్ని ఆదివారం తితిదే అధికారులు అందజేయనున్నారు. ఈవో అందించిన నివేదికపై శనివారం మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. 
 
ఈ సందర్భంగా ఈవో శ్యామల రావు మాట్లాడుతూ, ఆలయ సంప్రోక్షణ విషయంలో ఆగమ సలహాదారుల, అర్చకుల నుంచి వచ్చిన సలహాలు, సూచనలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళినట్టు చెప్పారు. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు ఆలయ సంప్రోక్షణ విషయంలో మరింత విస్తృత సంప్రదింపుల తదనంతరం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments