తితిదే ఈవోపై వేటు.. కొత్తగా జేఎస్వీ ప్రసాద్ నియామకం?

Webdunia
మంగళవారం, 5 నవంబరు 2019 (13:29 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు ప్రధాన కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్‌ను ఏపీ సర్కారు బదిలీ చేయనుంది. ఆయన స్థానంలో కొత్తగా సీనియర్ ఐఏఎస్ అధికారి జేఎస్వీ ప్రసాద్‌ను నియమించేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను నేడో రేపో అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. 
 
కాగా, జేఎస్వీ ప్రసాద్ ప్రస్తుతం రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఈయన స్థానంలో ఇప్పటికే సతీశ్ చంద్రను ప్రభుత్వం నియమించి, ఉత్తర్వులు కూడా జారీచేసింది. 
 
దీంతో జేఎస్వీ ప్రసాద్‌కు తితిదే బోర్డు బాధ్యతలు అప్పగించడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో జేఎస్వీ ప్రసాద్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ ఎక్స్ ఆఫీషియో మెంబరుగా కూడా సేవలందించారు. ఇక అనిల్ కుమార్‌కు ఏ బాధ్యతలు అప్పగిస్తారన్న విషయమై స్పష్టత రావాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

Rashmika: ది గర్ల్ ఫ్రెండ్ లో రశ్మికను రియలిస్టిక్ గా చూపించా : రాహుల్ రవీంద్రన్

Bhumi Shetty: ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ తో రాబోతున్న మహాకాళి చిత్రంలో భూమి శెట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments