Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల కనుమ రోడ్ల పునరుద్ధరణ - నడక మార్గం మూసివేత

Webdunia
ఆదివారం, 21 నవంబరు 2021 (09:58 IST)
ఇటీవల కురిసిన భారీ వర్షానికి కొండ చరియలు విరిగిపడటం వల్ల దెబ్బతిన్న తిరుమల ఘాట్ రోడ్లను అధికారులు తిరిగి పునరుద్ధరించారు. ఈ ఘాట్ రోడ్లపై భక్తుల వాహనాలను అనుమతిస్తున్నారు. 
 
ఇటీవల చిత్తూరు జిల్లాలో కుండపోత వర్షాలు కురిశాయి. ముఖ్యంగా, తిరుమలలో కొండంత వర్షం కురిసింది. దీంతో తిరుపతి పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. అలాగే, తిరుమలలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఇవి ఘాట్ రోడ్లపై పడటంతో వాహన రాకపోకలను నిలిపివేశారు. 
 
దీంతో రంగంలోకి దిగిన తితిదే అధికారులు యుద్ధ ప్రాతిపదికన కొండచరియలను తొలగించారు. అలాగే, దెబ్బతిన్న ఘాట్ రోడ్లకు తక్షణం మరమ్మతులు చేపట్టారు. ఈ పనులన్నీ పూర్తికావడంతో ఈ కనుమ రహదారిలో వాహన రాకపోకలకు అనుమతిస్తున్నారు. అయితే, ఇప్పటికి కేవలం ద్విచక్ర వాహనాలు మాత్రమే వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. 
 
అదేసమయంలో భక్తల కాలినడక మార్గంతో అలిపిరి మెట్ల మార్గాన్ని పూర్తిగా మూసివేశారు. ఈ భారీ వర్షాలతో పాటు.. వర్షపు నీటి ప్రవాహానికి ఈ మార్గాలు కూడా బాగా దెబ్బతిన్నాయి. దీంతో వీటికి మరమ్మతు పనులు చేపట్టారు. ఈ పనులు పూర్తయ్యేంత వరకు ఈ మార్గంలో భక్తలను అనుమతించరు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments