Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు ఉదయం వరకు తిరుమల కనుమదారులు మూసివేత

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (12:50 IST)
తిరుమలలో భారీ వ‌ర్షంతో అన్ని దారులు మూసివేశారు. ఈశాన్య రుతుపవనాలకు తోడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తిరుమల కనుమదారులను మూసివేస్తున్నట్టు తితిదే ప్రకటించింది. 
 
 
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో రెండు కనుమదారుల్లో చెట్లు, కొండచరియలు విరిగిపడుతున్నాయి. సాయంత్రం నుంచి వర్షం ఉద్ధృతి మరింత పెరగడంతో కనుమదారుల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారుతోంది. రెండో కనుమదారిలో 14వ కిలోమీటరు వద్ద, దిగువ ఘాట్‌ రోడ్‌లో రెండో మలుపులో రహదారిపై బండరాళ్లు పడ్డాయి. జేసీబీల సాయంతో బండరాళ్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. కనుమదారుల్లో మరింతగా కొండ చరియలు పడే అవకాశం ఉండటంతో రాత్రి 8గంటల నుంచి రేపు ఉదయం 6గంటల వరకు ఘాట్‌ రోడ్లను మూసివేయనున్నట్టు తితిదే అధికారులు తెలిపారు. 

 
భారీ వర్షాల కారణంగా తిరుమలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిపివేస్తున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. రాత్రి 7.30 గంటల నుంచి బస్‌ టికెట్ల జారీ నిలిపివేశారు. వాతావరణం అనుకూలించిన తర్వాతే బస్సు సర్వీసులు పునరుద్ధరిస్తామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

No Telugu: పబ్లిసిటీలో ఎక్కడా తెలుగుదనం లేని #సింగిల్ సినిమా పోస్టర్లు

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments