తిరుమలలో మరోసారి చిరుత కలకలం.. రోడ్డుపైనే సంచారం..

Webdunia
మంగళవారం, 7 జులై 2020 (16:25 IST)
అడవుల నుంచి వన్య మృగాలు కొండపైకి రావడం సర్వసాధారణమైంది. తిరుమల క్షేత్రం దట్టమైన శేషాచలం అడవుల్లో ఉంది. లాక్‌డౌన్ సమయంలో జన సంచారం లేకపోవడంతో అడవి జంతువులు తిరుమల కొండపై ప్రత్యక్షమయ్యాయి. ఇప్పుడు లాక్‌డౌన్ అన్‌లాక్ 2 దశలో.. జనాలు తిరుగుతున్నా.. అప్పుడప్పుడూ చిరుతలు ప్రత్యక్షమవుతున్నాయి.
 
తాజాగా తిరుమలలో మరోసారి చిరుతపులి కలకలం రేగింది. సోమవారం రాత్రి గ్యాస్ గోడౌన్ ప్రాంతంలో ఓ చిరుత రోడ్డు మీదకు వచ్చింది. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో రోడ్డుపై చిరుత సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ దృశ్యాలను చూసి స్థానికుల్లో ఆందోళన నెలకొంది. అటు అధికారులు సైతం రాత్రి వేళల్లో అవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments