Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రితో పొలానికి వెళ్లిన మూడేళ్ల చిన్నారి.. సజీవ దహనమైంది.. ఎలా?

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (13:21 IST)
తండ్రితో పొలం వెళ్లిన కూతురు కారులో ఆడుకుంటుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సజీవ దహనమైన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఇలా మూడేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తూ సజీవ దహనమైన విషాద ఘటనతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా, క్రోసూరు మండలం బయ్యవరంకు చెందిన కడియం మణికంఠ తన మూడేళ్ల కూతురు శ్రీనిధిని బొలెరో ట్రక్కు వాహనంలో ఎక్కించుకుని పొలం తీసుకెళ్లాడు. చిన్నారిని వాహనంలోనే కూర్చోబెట్టి తండ్రి వరిపొలంలో పంట నూర్పిడి పనులు చేసుకుంటున్నాడు.
 
హఠాత్తుగా కారులో మంటలు చెలరేగి దగ్ధమైంది. వాహనంలోనే ఆడుకుంటున్న చిన్నారి తీవ్రగాయాలపాలవడంతో వెంటనే ఆమెను గుంటూరు జిజిహెచ్‌కు తరలించారు. అప్పటికే శరీరం పూర్తిగా కాలిపోవడంతో ఆ చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమలో పూర్తిగా మునిగిపోతే తికమక చేస్తుంది : త్రిష

Samantha: సమంతకి సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments