Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురుకుల పాఠశాల విద్యార్థులను కాటేసిన పాము

Webdunia
శుక్రవారం, 4 మార్చి 2022 (11:48 IST)
ఏపీలోని విజయనగరం జిల్లా కురుపాంలో ఉన్న జ్యోతిరావ్ పూలో బీసీ గురుకుల పాఠశాలలో పాము కలకలం సృష్టించింది. ఈ పాఠశాలకు చెందిన అనుబంధ వసతి గృహంలో ఉండే విద్యార్థులను కాటేసింది. ఎనిమిదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులను పాము కరిచింది. దీంతో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 
 
దీంతో వెంటనే విద్యార్థులను స్థానికంగా ఉండే తిరుమల ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, రంజిత్ కుమార్ అనే విద్యార్థి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని ఐసీయూ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా, పాము కాటుకు గురైన విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీమున్నీరవుతున్నారు. ముఖ్యంగా, రంజిత్ కుమార్ అనే విద్యార్థి తల్లిదండ్రులు విలపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments