Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుతుపవనాల ప్రవేశంలో జాప్యం... మరో మూడు రోజులు ఎండలే

Webdunia
మంగళవారం, 6 జూన్ 2023 (14:30 IST)
నైరుతి రుతుపవనాల ప్రవేశంలో మరింత ఆలస్యంకానుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వచ్చే మూడు రోజుల పాటు ఎండలు మండిపోనున్నాయి. ముఖ్యంగా, పగటిపూట ఉష్ణోగ్రతలు మరింత అధికంగా నమోదయ్యే అవకాశాలు లేకపోలేదు. రుతుపవనాల రాక ఆలస్యంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అమరావతిలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
 
మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా నెల్లిపాక, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఏలూరు జిల్లా కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని మరో 212 మండలాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది. 
 
సోమవారం ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏలూరు జిల్లా శ్రీరామవురంలో 43.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్టు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments