Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దోబూచులాడుతున్న నైరుతి.. మరింత ఆలస్యం కావొచ్చంటున్న ఐఎండీ

Advertiesment
mansoon
, సోమవారం, 5 జూన్ 2023 (14:50 IST)
దేశంలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశం మరింత ఆలస్యం కానుంది. నైరుతి రుతుపవనాలు మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఆలస్యంగా కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ సోమవారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో తెలిపింది. 
 
వాస్తవానికి వర్షాలు గత కొన్ని రోజులుగా దూబూచులాడుతున్నాయి. అదేసమయంలో నైరుతి రుతుపవనాలు జూన్ నాలుగో తేదీ నాటికే కేరళ తీరాన్ని తాకుతాయని తొలుత అంచనా వేసింది. కానీ, ఈ అంచనాలు తారుమారయ్యాయి. జూన్ ఏడో తేదీ నాటికి రుతుపవనాలు కేరళను చేరుకుంటాయని తెలిపింది. ఆ తర్వాత అక్కడ నుంచి కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా దేశంలోని ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తాయని వెల్లడించింది.
 
"దక్షిణ అరేబియా సముద్రంపై పశ్చిమాది గాలులు పెరుగుతుండటంతో పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. పడమర గాలుల తీవ్ర ఆదివారం నుంచి మరింతగా పెరిగింది. సముద్ర ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తుకు జూన్ 4వ తేదీన చేరాయి. ఆగ్నేయ అరేబియా సముద్రంపైనా మేఘాలు వ్యాప్తి పెరుగుతోంది. ఈ అనుకూల పరిస్థితులతో రుతుపవనాలు వచ్చే మూడు నాలుగు రోజుల్లో మరింత పురోగమిస్తాయి" అని తెలిపింది. 
 
కాగా, ఈ యేడాది ఎల్ నినో ప్రభావం ఉంటున్నప్పటికీ సాదారణ వర్షాలకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ లోగడ ప్రకటించిన విషయం తెల్సిందే. గత 2022లో నైరుతి రుతుపవనాలు మే 29వ తేదీన కేరళ తీరాన్ని తాకగా, 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న చేరుకున్నాయి. ఈ ప్రకారంగా ఈ యేడాది ఇప్పటికే ఆలస్యమైనట్టు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒడిశాలో మరో రైలు ప్రమాదం.. పట్టాలుతప్పిన గూడ్సు రైలు