Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళయి మూడునెలలే, భర్త చనిపోతే అంత్యక్రియలను వీడియో కాల్‌లో చూసిన భార్య

Webdunia
శుక్రవారం, 1 మే 2020 (21:35 IST)
కరోనా వైరస్ కారణంగా ఎన్నో జీవితాలు ఛిద్రమవుతున్నాయి. నిరుపేదల విషయాన్ని అటుంచితే కొత్తగా పెళ్ళయిన వారి సంగతి మరీ దారుణంగా వుంటోంది. భార్య ఒక దగ్గర ఉంటే భర్త మరో దగ్గర ఉండటం నరకయాతనే. అలాంటి పరిస్థితే ఎదురైంది ఒక మహిళకు. కానీ చివరకు భర్తనే పోగొట్టుకుని కన్నీటిపర్యంతమైంది.
 
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం గోవిందపురానికి చెందిన నరేష్‌కు, శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరంకు చెందిన జ్యోతినిచ్చి మూడునెలల క్రితం వివాహం చేశారు. అయితే పెళ్ళయిన తరువాత కొన్నిరోజుల పాటు అత్తవారింట్లో ఉన్న నరేష్ లాక్‌డౌన్ ముందు తన ఇంటికి వచ్చేశాడు. 
 
అయితే లాక్‌డౌన్ ప్రారంభం కావడంతో భార్య వద్దకు వెళ్ళలేకపోయాడు. ఇంట్లోనే ఉండిపోయాడు. రోజూ భర్తతో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది భార్య. అయితే సరిగ్గా వారంరోజుల క్రితం కూరగాయల కోసం ఇంటి నుంచి మోటారు సైకిల్ పైన వెళ్ళిన నరేష్ కిందపడిపోయాడు. తలకు తీవ్రగాయాలైంది. అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు.
 
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా భార్య రాలేని పరిస్థితి. నిన్న చికిత్స పొందుతూ మరణించాడు. అయితే అంత్యక్రియలకు కూడా ఆమె రాలేకపోయింది. కారణం ఆమె ఉండే ప్రాంతం రెడ్ జోన్. ఇంటి నుంచి ఎవరినీ బయటకు పంపించలేదు పోలీసులు. దీంతో ఆమె చివరకు తన భర్త అంత్యక్రియలను వీడియో కాల్ ద్వారా చూస్తూ బోరున విలపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments