Webdunia - Bharat's app for daily news and videos

Install App

దోపిడీ మిస్టరీని ఛేదించిన పోలీసులు... సిబ్బందికి రివార్డులు

Webdunia
గురువారం, 18 జులై 2019 (15:28 IST)
ప్రగతి ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో దోపిడీ మిస్టరీని తమ పోలీసులు ఛేదించారని డీసీపీ విజయరావు వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఈ నెల 12వ తేదీన ప్రగతి ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రగతి పాండే ఉండగా ముగ్గురు అగంతకులు దాడి చేశారు. పాండేని కర్రలతో చితకబాది మూడున్నర లక్షల రూపాయలు దోచుకెళ్లారు. సిసి కెమెరాలు ఆధారంగా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు. ప్రగతి ట్రాన్స్‌పోర్ట్‌ను సంతోష్ త్రిపాఠితో కలిసి వేణుగోపాల్ ప్రారంభించాడు. 
 
వర్కింగ్ పార్టనర్‌గా ఉన్న వేణుగోపాల్ విభేదాలతో బయటకు వచ్చాడు. సంస్థలో జరిగిన‌ నష్టాన్ని ఎలాగైనా వసూలు చేసుకోవాలని వేణుగోపాల్ భావించాడు. వదిన కుమారుడు విశాల్‌కు విషయం చెప్పి మాస్టర్ ప్లాన్ వేశాడు. సిసి కెమెరా ఆధారంగా పర్యవేక్షణ చేస్తూ విశాల్‌కు సూచనలు చేశాడు. విశాల్, మరో ఇద్దరు వ్యక్తులు కలిసి 12వ తేదీన కర్రలతో దాడి చేసి మూడున్నర లక్షలు తెచ్చి వేణుగోపాల్‌కు ఇచ్చారు. ఈ కేసు మిస్టరీ‍ని చేధించిన సిబ్బందికి రివార్డులు ఇస్తాం డీసీపీ విజయరావు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments