Webdunia - Bharat's app for daily news and videos

Install App

దోపిడీ మిస్టరీని ఛేదించిన పోలీసులు... సిబ్బందికి రివార్డులు

Webdunia
గురువారం, 18 జులై 2019 (15:28 IST)
ప్రగతి ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో దోపిడీ మిస్టరీని తమ పోలీసులు ఛేదించారని డీసీపీ విజయరావు వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఈ నెల 12వ తేదీన ప్రగతి ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రగతి పాండే ఉండగా ముగ్గురు అగంతకులు దాడి చేశారు. పాండేని కర్రలతో చితకబాది మూడున్నర లక్షల రూపాయలు దోచుకెళ్లారు. సిసి కెమెరాలు ఆధారంగా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు. ప్రగతి ట్రాన్స్‌పోర్ట్‌ను సంతోష్ త్రిపాఠితో కలిసి వేణుగోపాల్ ప్రారంభించాడు. 
 
వర్కింగ్ పార్టనర్‌గా ఉన్న వేణుగోపాల్ విభేదాలతో బయటకు వచ్చాడు. సంస్థలో జరిగిన‌ నష్టాన్ని ఎలాగైనా వసూలు చేసుకోవాలని వేణుగోపాల్ భావించాడు. వదిన కుమారుడు విశాల్‌కు విషయం చెప్పి మాస్టర్ ప్లాన్ వేశాడు. సిసి కెమెరా ఆధారంగా పర్యవేక్షణ చేస్తూ విశాల్‌కు సూచనలు చేశాడు. విశాల్, మరో ఇద్దరు వ్యక్తులు కలిసి 12వ తేదీన కర్రలతో దాడి చేసి మూడున్నర లక్షలు తెచ్చి వేణుగోపాల్‌కు ఇచ్చారు. ఈ కేసు మిస్టరీ‍ని చేధించిన సిబ్బందికి రివార్డులు ఇస్తాం డీసీపీ విజయరావు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments