Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాకినాడ రాఘవమ్మ చెరువు నీటిలో విషం... చనిపోయిన వేలాది చేపలు

Webdunia
మంగళవారం, 9 మే 2023 (08:51 IST)
కాకినాడ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని పెద్దాపురం మండలం ఆర్బీ పట్నం శివారులోని రాఘవమ్మ చెరువులో గుర్తు తెలియని దుండగులు విషం కలిపారు. దీంతో చెరువులోని వేలాది చేపలు చనిపోతున్నాయి. చనిపోయిన చేపలు నీటిపై తేలాడుతూ ఒడ్డుకు కొట్టుకునివస్తున్నాయి. దీంతో ఆక్వా రైతులకు లక్షలాది రూపాయల మేరకు నష్టం వాటిల్లింది. 
 
ఈ చెరువును కొందరు ఆక్వా రైతులు లీజుకు తీసుకుని చేపల పెంపకాన్ని చేపట్టారు. ఇపుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చెరువులో విషం కలపడంతో చెరువులోని చేపలు చనిపోయాయి. ఈ దృశ్యాన్ని చూసిన రైతులు బోరున విలపిస్తున్నారు. చెరువు నీటిలో విషం కలపడం వల్లే బాగా పెరిగిన చేపలన్నీ చనిపోయాయని రైతులు చెబుతున్నారు. 
 
మరోవైపు, ఈ ఘటనపై చెరువు లీజుదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెరువులో విషం కలిపిన వారిని గుర్తించిం తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. కాగా, చెరువులో విషం కలిపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనిపై స్థానికులు సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

21 సంవత్సరాలా క్రితం ఆర్య టీమ్ ఎలా వున్నారో చూడండి

ఆధ్యాత్మిక తీర్థయాత్రలతో అందరికీ కనెక్ట్ అవ్వడానికి యూఎస్ఏ టూర్ లో మంచు విష్ణు

భవిష్యత్ లో ఎవరూ ఇలా చేయకూడదని మంచు విష్ణు ఉదంతంతో తెలుసుకున్నా : శ్రీవిష్ణు

నటుడిగా మల్లేశం ప్రియదర్శికి లైఫ్ ఇచ్చినట్లే 23 కూడా అందరికీ ఇస్తుంది : చంద్రబోస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments