Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాకినాడ రాఘవమ్మ చెరువు నీటిలో విషం... చనిపోయిన వేలాది చేపలు

Webdunia
మంగళవారం, 9 మే 2023 (08:51 IST)
కాకినాడ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని పెద్దాపురం మండలం ఆర్బీ పట్నం శివారులోని రాఘవమ్మ చెరువులో గుర్తు తెలియని దుండగులు విషం కలిపారు. దీంతో చెరువులోని వేలాది చేపలు చనిపోతున్నాయి. చనిపోయిన చేపలు నీటిపై తేలాడుతూ ఒడ్డుకు కొట్టుకునివస్తున్నాయి. దీంతో ఆక్వా రైతులకు లక్షలాది రూపాయల మేరకు నష్టం వాటిల్లింది. 
 
ఈ చెరువును కొందరు ఆక్వా రైతులు లీజుకు తీసుకుని చేపల పెంపకాన్ని చేపట్టారు. ఇపుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చెరువులో విషం కలపడంతో చెరువులోని చేపలు చనిపోయాయి. ఈ దృశ్యాన్ని చూసిన రైతులు బోరున విలపిస్తున్నారు. చెరువు నీటిలో విషం కలపడం వల్లే బాగా పెరిగిన చేపలన్నీ చనిపోయాయని రైతులు చెబుతున్నారు. 
 
మరోవైపు, ఈ ఘటనపై చెరువు లీజుదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెరువులో విషం కలిపిన వారిని గుర్తించిం తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. కాగా, చెరువులో విషం కలిపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనిపై స్థానికులు సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments