Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాకినాడ రాఘవమ్మ చెరువు నీటిలో విషం... చనిపోయిన వేలాది చేపలు

Webdunia
మంగళవారం, 9 మే 2023 (08:51 IST)
కాకినాడ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని పెద్దాపురం మండలం ఆర్బీ పట్నం శివారులోని రాఘవమ్మ చెరువులో గుర్తు తెలియని దుండగులు విషం కలిపారు. దీంతో చెరువులోని వేలాది చేపలు చనిపోతున్నాయి. చనిపోయిన చేపలు నీటిపై తేలాడుతూ ఒడ్డుకు కొట్టుకునివస్తున్నాయి. దీంతో ఆక్వా రైతులకు లక్షలాది రూపాయల మేరకు నష్టం వాటిల్లింది. 
 
ఈ చెరువును కొందరు ఆక్వా రైతులు లీజుకు తీసుకుని చేపల పెంపకాన్ని చేపట్టారు. ఇపుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చెరువులో విషం కలపడంతో చెరువులోని చేపలు చనిపోయాయి. ఈ దృశ్యాన్ని చూసిన రైతులు బోరున విలపిస్తున్నారు. చెరువు నీటిలో విషం కలపడం వల్లే బాగా పెరిగిన చేపలన్నీ చనిపోయాయని రైతులు చెబుతున్నారు. 
 
మరోవైపు, ఈ ఘటనపై చెరువు లీజుదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెరువులో విషం కలిపిన వారిని గుర్తించిం తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. కాగా, చెరువులో విషం కలిపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనిపై స్థానికులు సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments