Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మఒడి లబ్ధిదారులకు షాకింగ్ న్యూస్.. వెయ్యి కోత!

Webdunia
శనివారం, 21 మే 2022 (16:12 IST)
అమ్మఒడి లబ్ధిదారులకు షాకింగ్ న్యూస్. ఏపీలో ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక పథకం అమ్మఒడిలో మరో వెయ్యి రూపాయలు కోత పడనుంది. 
 
దేశంలో ఎక్కడా లేని విధంగా స్కూళ్లకు పిల్లల్ని పంపే తల్లులకు వైసీపీ సర్కార్ ఏటా రూ.15 వేల రూపాయల మొత్తాన్ని అమ్మఒడి పథకం రూపంలో ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీ మేరకు అధికారంలోకి రాగానే ప్రభుత్వం రూ.15 వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. 
 
అయితే వివిధ కారణాలతో ఈ పథకంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో లబ్దిదారులపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటోంది. ఇప్పటికే ఈ పథకానికి అర్హతల్ని పలుమార్లు మార్చిన ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చే మొత్తంలోనూ మార్పులు చేస్తోంది.
 
అమ్మఒడి పథకంలో భాగంగా మొత్తం రూ.15 వేల రూపాయలు తల్లుల ఖాతాల్లో ఏటా జమ చేయాల్సి ఉండగా.. ఇందులో వెయ్యి రూపాయలు కోత విధించి రూ.14 వేలే ఇస్తున్నారు. అదేమని అడిగితే స్కూళ్లలో మరుగుదొడ్ల నిర్వహణ కోసం ఈ వెయ్యి రూపాయలు కోత విధిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది. 
 
దీంతో తొలి ఏడాది నుంచే అర్హులకు లభించాల్సిన రూ.15 వేలకు బదులు రూ.14 వేలే జమ అవుతోంది. దీంతో తొలి ఏడాది నుంచే వెయ్యి రూపాయల కోతతో ఈ పథకం అమలవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments