Webdunia - Bharat's app for daily news and videos

Install App

పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం

ఠాగూర్
శనివారం, 21 జూన్ 2025 (14:59 IST)
నెల్లూరు జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. పద్మావతి ఎక్స్‌ప్రెస్ రైలులో దొంగలుపడ్డారు. శనివారం ఈ దోపిడీ జరిగింది. నెల్లూరు జిల్లా కావలి - వెంకటేశ్వరపాలెం మధ్య ప్రయాణిస్తున్నపుడు ఈ సంఘటన జరిగింది.
 
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పద్మావతి ఎక్స్‌ప్రెస్ తిరుపతికి బయలుదేరింది. ఈ రైలు, కావలి స్టేషన్ దాటిన తర్వాత వేంకటేశ్వర పాలెం సమీపంలోని రాగానే గుర్తు తెలియని దుండగులు రైలులోని మూడు బోగీల్లోకి ప్రవేశించారు
 
నిద్రపోతున్న ముగ్గురు మహిళా ప్రయాణికుల మెడలో నుంచి సుమారు 40 గ్రాముల బంగారు ఆభరణాలు లాక్కెళ్లారు. వారివద్ద ఉన్న రూ.20 వేల నగదు, మొబైల్ ఫోన్ కూడా అపహరించారు. తెల్లవారుజామున జరిగిన ఈ హఠాత్ పరిణామంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. 
 
దోడిపీ అనంతరం దొంగలు రైలు నుంచి దూకి పారిపోయారు. బాధితులు వెంటనే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments