Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీడియాలో వాయిస్ లేనోళ్లంతా జగన్‌కే ఓటు, భారీ మెజారిటీ: రాజు రవితేజ

ఐవీఆర్
మంగళవారం, 21 మే 2024 (13:02 IST)
సీఎం జగన్ మోహన్ రెడ్డి జూన్ 9న విశాఖపట్టణంలో రెండోసారి ముఖ్యమంత్రిగా పదవీప్రమాణం చేస్తారంటూ ఏపీ మంత్రిమండలిలోని మంత్రులందరూ ముక్తకంఠంతో చెబుతున్నారు. ఈ విషయాన్ని తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలియజేసింది. తాజాగా జగన్ రెండోసారి సీఎం అవుతారని జోస్యం చెబుతున్నారు ఒకప్పటి జనసేన పొలిట్ బ్యూరో సభ్యుడు రాజు రవితేజ.
 
ఆయన మాట్లాడుతూ... జగన్ మోహన్ రెడ్డి పేద ప్రజలకు అద్భుతమైన సేవ చేసారు. నగరాల్లోని ప్రజలకు మీడియా వాయిస్ వినిపించేందుకు అవకాశం వుంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియాలో వాయిస్ లేనివాళ్లు భారీ సంఖ్యలో వున్నారు. వాళ్లందరూ గంపగుత్తగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ వైసిపికి ఓట్లు వేసారని చెప్పుకొచ్చారు. పనులు మానేసి అందరూ ఓట్లు వేసినందువల్లనే అంత పెద్ద భారీ క్యూలలో ఓటర్లు బారులు తీరారనీ, వాళ్లంతా వైసిపికి ఓటు వేసారని అన్నారు. వాస్తవానికి వైసిపి గెలిస్తే సమాజం గెలిచినట్లే. పేదల పార్టీ వైసిపి తప్పక గెలుస్తుంది. ఆ పార్టీ గెలవాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నా అని అన్నారు.
 
కాగా 2019లో జనసేన పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడైనటువంటి రాజు రవితేజ ఆ పార్టీకి రాజీనామా చేశారు. జనసేన అధినేత ఓ ప్రమాదకరమైన విభజన శక్తిగా మారారంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అలాంటి వ్యక్తికి రాజకీయ పదవి ఇవ్వకూడదనీ, ప్రజాసేవకు అతడు పనికిరారంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. ఐతే రాజు రవితేజ రాజీనామా చేసిన వెంటనే పవన్ కల్యాణ్ వెంటనే ఆమోదించారు. రవితేజకు మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments