Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీడియాలో వాయిస్ లేనోళ్లంతా జగన్‌కే ఓటు, భారీ మెజారిటీ: రాజు రవితేజ

ఐవీఆర్
మంగళవారం, 21 మే 2024 (13:02 IST)
సీఎం జగన్ మోహన్ రెడ్డి జూన్ 9న విశాఖపట్టణంలో రెండోసారి ముఖ్యమంత్రిగా పదవీప్రమాణం చేస్తారంటూ ఏపీ మంత్రిమండలిలోని మంత్రులందరూ ముక్తకంఠంతో చెబుతున్నారు. ఈ విషయాన్ని తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలియజేసింది. తాజాగా జగన్ రెండోసారి సీఎం అవుతారని జోస్యం చెబుతున్నారు ఒకప్పటి జనసేన పొలిట్ బ్యూరో సభ్యుడు రాజు రవితేజ.
 
ఆయన మాట్లాడుతూ... జగన్ మోహన్ రెడ్డి పేద ప్రజలకు అద్భుతమైన సేవ చేసారు. నగరాల్లోని ప్రజలకు మీడియా వాయిస్ వినిపించేందుకు అవకాశం వుంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియాలో వాయిస్ లేనివాళ్లు భారీ సంఖ్యలో వున్నారు. వాళ్లందరూ గంపగుత్తగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ వైసిపికి ఓట్లు వేసారని చెప్పుకొచ్చారు. పనులు మానేసి అందరూ ఓట్లు వేసినందువల్లనే అంత పెద్ద భారీ క్యూలలో ఓటర్లు బారులు తీరారనీ, వాళ్లంతా వైసిపికి ఓటు వేసారని అన్నారు. వాస్తవానికి వైసిపి గెలిస్తే సమాజం గెలిచినట్లే. పేదల పార్టీ వైసిపి తప్పక గెలుస్తుంది. ఆ పార్టీ గెలవాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నా అని అన్నారు.
 
కాగా 2019లో జనసేన పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడైనటువంటి రాజు రవితేజ ఆ పార్టీకి రాజీనామా చేశారు. జనసేన అధినేత ఓ ప్రమాదకరమైన విభజన శక్తిగా మారారంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అలాంటి వ్యక్తికి రాజకీయ పదవి ఇవ్వకూడదనీ, ప్రజాసేవకు అతడు పనికిరారంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. ఐతే రాజు రవితేజ రాజీనామా చేసిన వెంటనే పవన్ కల్యాణ్ వెంటనే ఆమోదించారు. రవితేజకు మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments