Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (10:02 IST)
రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది.  3,335 పంచాయతీల సర్పంచ్‌లకు, 33,632 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

మంగళవారం నుంచి 4వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఐదో తేదీన పరిశీలన మొదలవుతుంది. 8న మధ్యాహ్నం మూడు గంటల లోపు అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుని అదే రోజు తుది జాబితాను ఖరారు చేస్తారు.

13వ తేదీ పోలింగ్‌ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ చేపట్టి, అదేరోజు ఫలితాలు ప్రకటిస్తారు. అదేరోజు సాయంత్రంగానీ, లేక మరుసటిరోజు ఉదయం గానీ ఉపసర్పంచ్‌లను ఎన్నుకుంటారు.
 
నేడు విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో ఎస్‌ఈసీ పర్యటన
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ ఈరోజు విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు విశాఖ జిల్లా అధికారులతో ఎస్‌ఈసీ సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు తూర్పుగోదావరి జిల్లా అధికారులతో నిమ్మగడ్డ సమీక్ష చేయనున్నారు.

అనంతరం రాత్రి 7 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా అధికారులతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అధికారులతో ఎస్‌ఈసీ చర్చలు జరుపనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments