Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీటీడీ ఆస్తుల విక్రయం సరికాదు: వైసీపీ ఎంపీ

Webdunia
సోమవారం, 25 మే 2020 (19:21 IST)
నిరర్ధక ఆస్తుల పేరుతో భూములను వేలం వేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీసుకున్న నిర్ణయం పట్ల అధికార వైసీపీ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టీటీడీ నిర్ణయాన్ని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తప్పుబట్టారు.

ఇది ముమ్మాటికీ భూముల విరాళం ఇచ్చిన దాతల మనోభావాలను దెబ్బతీయడమేనని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు సరిచేయాల్సింది పోయి అదే తప్పు చేయాలని టీటీడీ భావించడాన్ని ఎంపీ తప్పుబట్టారు.

ఆస్తుల అమ్మకం భగవంతుడికి టీటీడీ చేస్తున్న ద్రోహం అని ఎంపీ తప్పుబట్టారు. టీటీడీ భూములపై పాలకమండలి నిర్ణయం ఏమాత్రం సరికాదన్నారు. భక్తితో ఇచ్చిన భూములు విక్రయించే నిర్ణయం సరికాదన్నారు.

దాతలు ఇచ్చిన ఆస్తుల పరిరక్షణకు పాలకమండలి పనిచేయాలని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఈ విషయాన్ని టీటీడీ ఆస్తుల విక్రయం విషయం సీఎం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ఈ నిర్ణయాన్ని త్వరలోనే టీటీడీ వెనక్కి తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments