Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాపం ఆవేదనతో సిఎం చిన్నాన్న.. మళ్ళీ?

Webdunia
శనివారం, 19 జూన్ 2021 (22:12 IST)
టిటిడి పాలకమండలి ఛైర్మన్‌గా రెండేళ్ళ పదవీ కాలం పూర్తయ్యింది వై.వి.సుబ్బారెడ్డి పాలకమండలికి. ఈ నెల 21వ తేదీకి ఈ పదవీకాలం ముగియనుంది. ఈ రోజు చివరి పాలకమండలి సమావేశం తిరుమలలో జరిగింది. చివరి పాలకమండలి సమావేశం కావడంతో సభ్యులందరూ హాజరయ్యారు. 
 
చివరి పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులకు అవగాహన కల్పించి టిటిడి ద్వారా రైతుల వద్ద పంటలు పండిస్తామన్నారు టిటిడి ఛైర్మన్. త్వరలో ఎస్వీబీసీ ఛానల్‌ను కన్నడ, హిందీ భాషల్లో ప్రారంభిస్తామన్నారు.
 
శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా కొన్ని దేవాలయాలను పుననిర్మిస్తామన్నారు. దేశ వ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్‌లో భాగంగా కాశ్మీర్లో ఆలయ నిర్మాణం చేపట్టామని.. త్వరలోనే ఆలయం పూర్తి చేసి భక్తులకు అందుబాటులో ఉంచుతామన్నారు. అలాగే గుడికి గోమాత కార్యక్రమంను టిటిడి పాలకమండలి నిర్ణయంతో వంద ఆలయాలకు గోవులను అందించామన్నారు. 
 
గత రెండు సంవత్సరాల నుంచి భక్తులకు మెరుగైన సేవలు అందించే కార్యక్రమం చేశామని.. విఐపి బ్రేక్ దర్సనాల్లో ఎల్1, ఎల్2 విధానాన్ని రద్దు చేశామన్నారు. అంతేకాకుండా బేడీ ఆంజనేయస్వామి ఆలయం చుట్టూ ఉన్న దుకాణాలను తొలగిస్తామన్నారు. హనుమాన్ జన్మస్థలం తిరుమలగానే భావిద్దామని స్పష్టం చేశారు.
 
భక్తుల కష్టాలను తీర్చే గరుడ వారధిని అలిపిరి వరకు పొడిగిస్తామన్నారు. అలాగే తిరుమల-తిరుపతి మధ్య 100 ఆర్టీసీ బస్సులు తిరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. 100 బస్సులు ప్రారంభం కాగానే పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని ఆర్టీసీని కోరుతామన్నారు. కొండపై ఉన్న టాక్సీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments