Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో అతిపెద్ద అతిథి గృహం

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2020 (09:03 IST)
ఏపీ ప్రభుత్వం విశాఖలో అతిపెద్ద అతిథి గృహం నిర్మించాలని నిర్ణయించింది. ఆ మేరకు కార్యాచరణకు దిగింది. విశాఖలో పాలనా రాజధాని ఏర్పాటుకు ఉత్సాహం చూపుతున్న జగన్ ప్రభుత్వం.. ఇప్పుడీ అతిథి గృహం నిర్మించడానికి పూనుకోవడం గమనార్హం.

భీమిలి నియోజకవర్గంలోని కాపులుప్పాడలో 30 ఎకరాల్లో అతిథి గృహం నిర్మించాలని నిర్ణయించింది. కాపులుప్పాడలో గ్రేహౌండ్స్‌ విభాగం ఉంది. అదంతా కొండ ప్రాంతం. పైనుంచి చూస్తే ఒక వైపు సముద్రం...మరో వైపు దూరంగా జాతీయ రహదారి కనిపిస్తాయి.
 
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, సీఎం, మంత్రులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, సీనియర్‌ ఐఏఎస్‌ సహా వీవీఐపీలు, వీఐపీలు వచ్చినప్పుడు వారికి ప్రొటోకాల్‌ ప్రకారం గెస్ట్‌హౌ్‌సలు సమకూర్చడం ప్రస్తుతం కష్టంగా ఉంటోంది.

అటు విజయవాడ, ఇటు విశాఖ స్టార్‌ హోటళ్లలో వసతికి భారీ వ్యయమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడికక్కడ గెస్ట్‌హౌ్‌సలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొమ్మిది నెలల్లో దీనిని పూర్తి చేయాలని నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments