Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో అతిపెద్ద అతిథి గృహం

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2020 (09:03 IST)
ఏపీ ప్రభుత్వం విశాఖలో అతిపెద్ద అతిథి గృహం నిర్మించాలని నిర్ణయించింది. ఆ మేరకు కార్యాచరణకు దిగింది. విశాఖలో పాలనా రాజధాని ఏర్పాటుకు ఉత్సాహం చూపుతున్న జగన్ ప్రభుత్వం.. ఇప్పుడీ అతిథి గృహం నిర్మించడానికి పూనుకోవడం గమనార్హం.

భీమిలి నియోజకవర్గంలోని కాపులుప్పాడలో 30 ఎకరాల్లో అతిథి గృహం నిర్మించాలని నిర్ణయించింది. కాపులుప్పాడలో గ్రేహౌండ్స్‌ విభాగం ఉంది. అదంతా కొండ ప్రాంతం. పైనుంచి చూస్తే ఒక వైపు సముద్రం...మరో వైపు దూరంగా జాతీయ రహదారి కనిపిస్తాయి.
 
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, సీఎం, మంత్రులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, సీనియర్‌ ఐఏఎస్‌ సహా వీవీఐపీలు, వీఐపీలు వచ్చినప్పుడు వారికి ప్రొటోకాల్‌ ప్రకారం గెస్ట్‌హౌ్‌సలు సమకూర్చడం ప్రస్తుతం కష్టంగా ఉంటోంది.

అటు విజయవాడ, ఇటు విశాఖ స్టార్‌ హోటళ్లలో వసతికి భారీ వ్యయమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడికక్కడ గెస్ట్‌హౌ్‌సలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొమ్మిది నెలల్లో దీనిని పూర్తి చేయాలని నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments