Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభనం గదికి వెళ్ళి కింద పడిన వరుడు, ఆసుపత్రికి తీసుకెళితే కరోనా పాజిటివ్, అంతే!!

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2020 (19:09 IST)
కరోనావైరస్‌తో ఎంతోమంది చనిపోతున్నారు. మరికొంతమంది అనారోగ్యం పాలవుతూ చివరకు ఎన్నో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ఒక నవ వరుడు కరోనాతో మృతి చెందడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. అది కూడా పెళ్ళయిన 10 రోజులకే.
 
చిత్తూరు జిల్లా వి.కోటమండలం వెర్ని గ్రామం. ఈ నెల 12వ తేదీ కుటుంబ సభ్యులు పరిమిత సంఖ్యలో హాజరై వివాహం జరిపించారు. రాత్రికి శోభనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు. వరుడి గదిలోకి వధువును పంపించారు. సరిగ్గా 10 నిమిషాలకే వధువు పెద్దగా కేకలు వేసింది.
 
ఏం జరిగిందో అర్థంకాక బంధువులందరూ పరిగెత్తుకు వెళ్ళారు. అప్పటికే వరుడు మంచం మీద నుంచి కిందపడిపోయాడు. స్పృహలో లేడు. వెంటనే వేలూరు సిఎంసికి తీసుకెళ్ళారు. అయితే ఆసుపత్రిలో మొదటగా ట్రూనాట్ పరీక్ష చేసి పాజిటివ్‌గా నిర్థారించారు.
 
దాంతో పాటు పక్షవాతం కూడా జత కావడంతో సీరియస్ కండిషన్‌లోకి వెళ్ళిపోయాడు. చివరకు చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. కాళ్ళ పారాణి ఆరక ముందే భర్త చనిపోవడంతో ఆ నవ వధువు తీవ్రంగా కన్నీంటి పర్యంతమవుతోంది. వరుడు బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments