Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరాఫ్ కంచరపాలెం, గుట్టు చప్పుడు కాకుండా శ్మశానికి యువతి మృతదేహం... ఏం జరిగింది?

Webdunia
మంగళవారం, 15 అక్టోబరు 2019 (20:33 IST)
కంచరపాలెం అనగానే మనకు ఆ పేరుతో నిర్మించిన కేరాఫ్ కంచరపాలెం చిత్రం గుర్తుకు వస్తుంది. ఇప్పుడు మరోసారి ఈ పేరు వార్తల్లోకి ఎక్కింది. విషయం ఏంటంటే... కంచరపాలెం పరిధిలో వున్న ఓ శ్మశానానికి 17 ఏళ్ల యువతి శవాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఆమె కుటుంబ సభ్యులు తీసుకురావడమే. అది కూడా ఎవరికీ తెలియకుండా గోప్యంగా అంత్యక్రియలు చేయాలని వారు ప్రయత్నించడం, యువతి గొంతు పైన గాయాలు వుండటంతో కాటికాపరికి అనుమానం వచ్చింది. దాంతో అసలు విషయం బయటకు వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే... విశాఖ నగరంలోని మధురవాడకు చెందిన గోరి బహుదూర్‌ అనే వ్యక్తి చైతన్య ఇంజనీరింగ్‌ కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఏమైందో తెలియదు కానీ సోమవారం అతడి 17 ఏళ్ల కుమార్తె మీను అనుమానాస్పద రీతిలో చనిపోయింది. దీనితో ఆమె శవాన్ని గుట్టుచప్పుడు కాకుండా జ్ఞానాపురం శ్మశాన వాటికకు తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. 
 
శవం వెంట కుటుంబ సభ్యులు తప్ప వేరే ఎవరూ లేకపోవడంతో కాటికాపరికి అనుమానం వచ్చి యువతి శవాన్ని పరీక్షించి చూశాడు. ఆమె గొంతుపైన గాయాలు కనబడ్డాయి. దీనితో ఏదో ఘోరం జరిగి వుంటుందని కంచరపాలెం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడికి చేరుకుని యువతి శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించారు. 
 
రిపోర్టులో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. ఆమె ఆత్మహత్య చేసుకున్నదన్న విషయం బయటపడితే పరువు పోతుందన్న భయంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశానానికి తీసుకెళ్లినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకున్నదన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

Rashmika : రష్మిక మందన్న పాన్ ఇండియా మూవీ మైసా ఫియర్స్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments