Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో చొరబడిన ఉగ్రవాదులు... హైఅలెర్ట్?

Webdunia
బుధవారం, 22 మే 2019 (13:11 IST)
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెల్లడికానున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఉగ్రవాదులు ప్రవేశించారని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. అన్ని జిల్లాల్లో పోలీసులు గస్తీని ముమ్మరంచేశారు. అలాగే, హోటళ్లు, లాడ్జీల్లో కొత్తవారు దిగితే వెంటనే సమాచారం అందించాలని యాజమాన్యాలను ఆదేశించారు. 
 
అలాగే నగరాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ముఖ్యంగా నౌకాశ్రయాలు లక్ష్యంగా దాడులు జరిగే అవకాశముందన్న సమాచారంతో భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పన్నపూడి పాతవూరు సమీపంలో మత్స్యకారులకు అనుమానాస్పద పడవ ఒకటి లభ్యమైంది. 
 
ఆ బోటుపై శ్రీలంక అని రాసి ఉంది. దీంతో జాలర్లు పోలీసులకు సమాచారం అందించారు. ఇటీవల శ్రీలంకలో ఐసిస్ అనుబంధ సంస్థగా ఉన్న నేషనల్ తౌహీద్ జమాత్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడి 258 మందిని చంపేసిన విషయం తెల్సిందే. దీంతో ఆ సంస్థకు చెందిన ఉగ్రవాదులే భారత్‌లోకి ప్రత్యేక బోట్ ద్వారా ప్రవేశించి ఉంటారని నిఘావర్గాలు హెచ్చరించాయి. దీంతో కేంద్ర వర్గాలు కోస్తాతీర రాష్ట్రాల పోలీసులను హెచ్చరించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments