గర్భం చేసింది ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

సెల్వి
సోమవారం, 17 ఫిబ్రవరి 2025 (14:34 IST)
ఏపీలో దారుణం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లాలో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. పదో తరగతి విద్యార్థినిని గుర్తు తెలియని వ్యక్తి గర్భవతిని చేశాడు. ఈ క్రమంలో ప్రసవ వేదన భరించలేక ఆ చిట్టితల్లి మృతి చెందింది. 
 
వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా పలమనేరు పదో తరగతి విద్యార్థిని గర్భం దాల్చింది. గర్భం చేసింది ఎవరో కూడా తెలియకపోవడంతో ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. 16 ఏళ్ల బాలిక స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. 
 
బాలిక తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం బాలిక గర్భం దాల్చింది. విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆమెను పాఠశాలకు పంపలేదు. ఈ క్రమంలో ఆమెను ఇంట్లోనే ఉంచారు. అయితే శనివారం రాత్రి బాలికకు పురిటి నొప్పులు తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు ఓ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. 
 
ఈ క్రమంలో ఆదివారం బాలికకు ఆడబిడ్డ జన్మించింది. ఈ క్రమంలో వెంటనే ఆమెకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో తల్లిబిడ్డలను అంబులెన్సులో తిరుపతికి తరించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక గర్భానికి కారకులు ఎవరనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిధి అగర్వాల్‌ను అసభ్యంగా తాకిన పోకిరీలు

మంచి మాటలు చెప్పే ఉద్దేశ్యంతో అసభ్య పదాలు వాడాను : శివాజీ (వీడియో)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి రొమాంటిక్ మెలోడీ ‘ఏదో ఏదో’ సాంగ్ విడుదల

Aadi: షూటింగ్‌లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా గాయాలు అవుతుంటాయి : ఆది సాయి కుమార్

ఈషా షూటింగ్ లో అరకులో ఓ పురుగు కుట్టి ఫీవర్‌ వచ్చింది : అఖిల్‌ రాజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో క్రిస్మస్ వేళ ప్రతి క్షణాన్ని ప్రత్యేకంగా చేసుకోండి

కిడ్నీలు జాగ్రత్త... షుగర్ ట్యాబ్లెట్స్ వేస్కుంటున్నాంగా, ఏమవుతుందిలే అనుకోవద్దు

ఫ్యాషన్‌లో కొత్త విప్లవాన్ని సృష్టిస్తున్న బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

తిరుపతిలో రోబోటిక్ సర్జరీపై సదస్సు: భారీ ఫైబ్రాయిడ్ తొలగింపుతో ప్రపంచ రికార్డు దిశగా గ్లీనీ ఈగల్స్ హాస్పిటల్ చెన్నై

కోడిగుడ్డుతో కేన్సర్ రాదు, నిర్భయంగా తినేయండి అంటున్న FSSAI

తర్వాతి కథనం
Show comments